షార్జాలో లేడీస్ రూంలోకి తొంగి చూసి కాలు జారి మృతిచెందిన భారత యువకుడు
- December 29, 2016
ఓ భారతీయ యువకుడు ఓ ఎత్తైన భవనంలోని లేడీస్ రూంలోకి తొంగి చూశాడు. అక్కడి నుంచి కిందపడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన యూఏఈలోని షార్జాలో జరిగింది. అతను 28 ఏళ్ల భారతీయ యువకుడిగా గుర్తించారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆ యువకుడి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం మేరకు.. పక్కనే ఉన్న భవనంలోని ఓ గదిలో అమ్మాయిలు నివసిస్తున్నారు. వారిని చూసేందుకు తొంగి చూశాడు. కానీ అంత ఎత్తైన బిల్డింగ్ నుంచి అతను బ్యాలెన్స్ తప్పి, కింద పడిపోవడంతో చనిపోయాడు. ఈ సంఘటన షార్జా ఇండస్ట్రియల్ ఏరియా నెంబర్ 8లో చోటు చేసుకుంది. అది చూసిన స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. విషయం తెలియగానే వారు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు అతని వేలిముద్రలు సేకరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







