షార్జాలో లేడీస్ రూంలోకి తొంగి చూసి కాలు జారి మృతిచెందిన భారత యువకుడు

- December 29, 2016 , by Maagulf
షార్జాలో లేడీస్ రూంలోకి తొంగి చూసి కాలు జారి మృతిచెందిన భారత యువకుడు

ఓ భారతీయ యువకుడు ఓ ఎత్తైన భవనంలోని లేడీస్ రూంలోకి తొంగి చూశాడు. అక్కడి నుంచి కిందపడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన యూఏఈలోని షార్జాలో జరిగింది. అతను 28 ఏళ్ల భారతీయ యువకుడిగా గుర్తించారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆ యువకుడి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం మేరకు.. పక్కనే ఉన్న భవనంలోని ఓ గదిలో అమ్మాయిలు నివసిస్తున్నారు. వారిని చూసేందుకు తొంగి చూశాడు. కానీ అంత ఎత్తైన బిల్డింగ్ నుంచి అతను బ్యాలెన్స్ తప్పి, కింద పడిపోవడంతో చనిపోయాడు. ఈ సంఘటన షార్జా ఇండస్ట్రియల్ ఏరియా నెంబర్ 8లో చోటు చేసుకుంది. అది చూసిన స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. విషయం తెలియగానే వారు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు అతని వేలిముద్రలు సేకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com