సెంట్రల్ మార్కెట్ తరలింపుతో అసౌకర్యం..
- December 29, 2016
వెజిటబుల్, ఫిష్ మరియు క్యాటిల్ మార్కెట్స్ని దోహా సెంట్రల్ మార్కెట్ నుంచి వక్రా, సైలియా, ఉమ్ సలాల్ అలి ప్రాంతాలకు కొద్ది నెలల్లో తరలించనుండడంతో వినియోగదారులకి, అలాగే వ్యాపారులకు సమస్యలు తెచ్చిపెట్టనున్నాయి. తాత్కాలిక ఇబ్బందులే అయినా వీటి కారణంగా తలెత్తే అసౌకర్యం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకేసారి వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళడం కష్టమేనని వినియోగదారులు అంటున్నారు. అయితే ఈ మార్పు అర్థం చేసుకోదగ్గదేననే భావన కూడా వ్యక్తమవుతోంది కొందరిలో. ఓ వ్యాపారి మాట్లాడుతూ ఒకే చోట అన్నీ లభ్యం కావడం వల్ల వ్యాపారం సజావుగా సాగుతుందనీ, ఒక్కో చోటకి ఒక్కో రకమైన వస్తువల కోసం వినియోగదారులకు వెళ్ళాల్సి వస్తే వ్యాపారం మందగిస్తుందని అన్నారు. సెంట్రల్ మార్కెట్లో వినియోగదారులకు పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, అన్ని రకాలైన తమ అవసరాలూ ఒకే చోట తీరిపోతాయి. అలాగే బల్క్ కొనుగోళ్ళు ఇక్కడ చవకగా జరుగుతాయి. మార్కెట్ మార్పుతో తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఓ వ్యాపారి చెప్పారు. ఇంకో వైపున ఆయా ప్రాంతాల్లో కొత్త మార్కెట్ల నిర్మాణం దాదాపుగా కొలిక్కి వచ్చిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









