జాగృతి క్రికెట్ కప్ 7 నుంచి..
- December 30, 2016
తెలంగాణ జాగృతి క్రికెట్ కప్ వచ్చే నెల 7 నుంచి 23వ తేదీ వరకు జరుగనుంది. గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యానికి మెరుగులు దిద్దడమే లక్ష్యంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్లు జాగృతి నేతలు తెలిపారు. టోర్నీలో విజేతకు అందజేసే ట్రోఫీని నిజామాబాద్ ఎంపీ కల్వ కుంట్ల కవిత శుక్రవారం ఆవిష్కరించారు. పాత పది జిల్లాలను జోన్లుగా విభజించి ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఒక్కో జోన్ నుంచి 24 జట్ల చొప్పున మొత్తం 240 జట్లు ఇందులో పోటీపడతాయి. ముందుగా 7 నుంచి జోనల్ స్థారుులో పోటీలు జరుగుతాయి. ఇందులో విజేతగా నిలిచిన 10 జట్లు రాష్ట్రస్థాయి టోర్నీలో తలపడతాయి. .
జనవరి 17 నుంచి ఈ పోటీలు మొదలవుతాయి. సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన 23వ తేదీన ఫైనల్ పోరును నిర్వహిస్తారు.
ఈ మ్యాచ్ ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. జోనల్ స్థాయి విన్నర్స్కు రూ. 30 వేలు, రన్నర్స్కు రూ. 15 వేలు, రాష్ట్రస్థాయి గ్రాండ్ ఫైనల్స్ విజేతకు రూ. 3 లక్షలు, రన్నరప్ జట్టుకు రూ. 1.5 లక్షలు ప్రైజ్మనీ అందజేస్తారు. ఇందులో పాల్గొనాలనుకునే ఆసక్తిగల జట్లు వచ్చే నెల 2 నుంచి 4వ తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో ఉన్న తెలంగాణ జాగృతి కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మరిన్ని వివరాలకు 040-40213214 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







