జాగృతి క్రికెట్ కప్ 7 నుంచి..
- December 30, 2016
తెలంగాణ జాగృతి క్రికెట్ కప్ వచ్చే నెల 7 నుంచి 23వ తేదీ వరకు జరుగనుంది. గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యానికి మెరుగులు దిద్దడమే లక్ష్యంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నట్లు జాగృతి నేతలు తెలిపారు. టోర్నీలో విజేతకు అందజేసే ట్రోఫీని నిజామాబాద్ ఎంపీ కల్వ కుంట్ల కవిత శుక్రవారం ఆవిష్కరించారు. పాత పది జిల్లాలను జోన్లుగా విభజించి ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. ఒక్కో జోన్ నుంచి 24 జట్ల చొప్పున మొత్తం 240 జట్లు ఇందులో పోటీపడతాయి. ముందుగా 7 నుంచి జోనల్ స్థారుులో పోటీలు జరుగుతాయి. ఇందులో విజేతగా నిలిచిన 10 జట్లు రాష్ట్రస్థాయి టోర్నీలో తలపడతాయి. .
జనవరి 17 నుంచి ఈ పోటీలు మొదలవుతాయి. సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన 23వ తేదీన ఫైనల్ పోరును నిర్వహిస్తారు.
ఈ మ్యాచ్ ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. జోనల్ స్థాయి విన్నర్స్కు రూ. 30 వేలు, రన్నర్స్కు రూ. 15 వేలు, రాష్ట్రస్థాయి గ్రాండ్ ఫైనల్స్ విజేతకు రూ. 3 లక్షలు, రన్నరప్ జట్టుకు రూ. 1.5 లక్షలు ప్రైజ్మనీ అందజేస్తారు. ఇందులో పాల్గొనాలనుకునే ఆసక్తిగల జట్లు వచ్చే నెల 2 నుంచి 4వ తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో ఉన్న తెలంగాణ జాగృతి కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మరిన్ని వివరాలకు 040-40213214 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







