బాణాసంచా పేలుడు లో 10 మంది మృతి..
- December 30, 2016
నెల్లూరు జిల్లా కేంద్రం శివారులోని పొర్లుకట్ల సమీపంలో శనివారం పెను విషాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి 10 మంది సజీవ దహనమయ్యారు.. మరో పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.పేలుడు ధాటికి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి.
సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని 108 వాహనాల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పలువురి శరీరం పూర్తిగా కాలిపోవడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు తీవ్రత అధికంగా ఉండటంతో సహాయచర్యలు చేపట్టేందుకు ఆటంకంగా మారింది.
పొర్లుకట్ట.. బాణాసంచా తయారీకి అడ్డా
నెల్లూరు నగర శివారులోని పొర్లుకట్ల బాణాసంచా తయారీకి ప్రసిద్ధి చెందింది. జిల్లావ్యాప్తంగా ఇక్కడి నుంచే బాణాసంచా ఎగుమతి చేస్తుంటారు. సీజన్లతో సంబంధం లేకుండా సంవత్సరమంతా ఇక్కడ బాణాసంచా తయారుచేస్తుంటారు. ఇక్కడి బాణాసంచా తయారీ కేంద్రాల్లో చాలావాటికి కనీస అనుమతులు లేనట్లు సమాచారం. పోలీసులు అప్పుడప్పుడూ దాడులు చేయడం తప్ప.. కేసులు పెట్టిన దాఖలాలు కూడా లేనట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







