యెమెన్ మృత్యుఘోష
- September 09, 2015
యెమెన్ సంక్షోభం ఇంకా కలవరపెడుతూనే వుంది. ఏ క్షణం ఏమవుతుందో తెలీని పరిస్థితులు నెలకొంటున్నాయి. తుపాకుల శబ్దాలు, వైమానిక దాడుల మోతతో హోరెత్తుతోంది. ఇలాంటి భీతావహ వాతావరణం... పౌరులకు కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది. చమురు స్మగ్లర్లను మట్టుబెట్టడమే లక్ష్యంగా...... చమురు స్మగ్లర్లను మట్టుబెట్టడమే లక్ష్యంగా సౌదీ వాయుసేనలు విరుచుకుపడ్డాయి. వైమానిక దాడులతో బీభత్సం సృష్టించాయి. ఈ దాడుల్లో 20 మంది భారతీయులు మృతిచెందినట్లు తెలుస్తోంది. యెమెన్ లోని హుదైదా పోర్టు సమీపంలో సౌదీ దేశాల వాయుసేనలు సంయుక్తంగా ఆయిల్ స్మగ్లర్లపై దాడులు చేపట్టాయి. ఈ దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వైమానిక దాడుల్లో రెండు బోట్లు ధ్వంసం?.... వాయుసేనలు ఆకస్మికంగా చేసిన దాడిలో రెండు బోట్లు ప్రమాదానికి గురైనట్లు స్థానికులు, మత్యకారులు చెబుతున్నారు. ఈ ఘటనలో భారత దేశానికి చెందిన కార్మికులు అధిక సంఖ్యలో మృతి చెంది ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు. వాయుసేనలు చేసిన దాడుల్లో 12 మంది తిరుగుబాటు దారులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. గతవారం తిరుగుబాటు దారులు చేసిన దాడిలో సుమారు 60 మంది ఎమిరేట్స్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







