'మరియప్పన్‌' ఫస్ట్‌లుక్‌ విడుదల..

- January 01, 2017 , by Maagulf
'మరియప్పన్‌'  ఫస్ట్‌లుక్‌ విడుదల..

పారాలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన అథ్లెట్‌ మరియప్పన్‌ తంగవేలు జీవితం ఆధారంగా దర్శకురాలు ఐశ్వర్య ధనుష్‌ 'మరియప్పన్‌' పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ఖాన్‌ ట్విట్టర్‌ ద్వారా ఆదివారం విడుదల చేశారు. 'మరియప్పన్‌ బయోపిక్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నాం.. మన నేషనల్‌ హీరో, ఆల్‌ ది బెస్ట్‌ ఐశ్వర్య ధనుష్‌' అని షారుఖ్‌ ట్వీట్‌ చేశారు. దీనికి ఐశ్వర్య ధన్యవాదాలు తెలుపుతూ.. షారుఖ్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.

తంగవేలు తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలో జన్మించాడు. చిన్న వయసులో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో అతడి కుడి మోకాలు దెబ్బతింది. అయినా తల్లి కష్టంతో పారాలింపిక్స్‌లో పతాకమే లక్ష్యంగా పెట్టుకుని సత్తాచాటాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com