'తేజస్' తో హైఫై ప్రయాణం!
- January 04, 2017
ఎల్సీడీ టీవీ, వైఫైతో పాటు పసందైన వంటకాలు మీ దగ్గరకే రానున్నాయి. ఇంతకీ ఏ రెస్టారంట్లోనో అనుకుంటే మాత్రం పొరపాటే! ఇవన్నీ రైల్వే శాఖ తాజాగా తీసుకొచ్చే 'తేజస్' రైలులో అందుబాటులో ఉంటాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపొందిన ఈ రైలు త్వరలోనే భారత పట్టాలపై పరుగులు పెట్టనుంది. ఇందుకోసం రైల్వేశాఖ ఇప్పటికే సన్నద్ధమయ్యింది. 2016-17 బడ్జెట్లో కేంద్రం దీన్ని ప్రకటించగా.. మరో రెండు నెలల్లో దీన్ని తీసుకువస్తున్నట్లు ఇటీవలే రైల్వే మంత్రి సురేష్ప్రభు ప్రకటించారు.
రైల్వే ప్రయాణాన్ని మరింత సుఖవంతంగా మార్చేందుకు ఇప్పటికే కేంద్రం హంసఫర్, గతిమాన్ ఎక్స్ప్రెస్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 22 కొత్త సదుపాయాలతో తాజాగా మరో రైలును రైల్వేశాఖ తీసుకొస్తోంది.
ప్రత్యేకతలివీ..
* రైలులో ఎగ్జిక్యూటివ్, ఛైర్కార్ అనే రెండు ఏసీ బోగీలు ఉంటాయి. రైలు లోపల, బయట రంగులు ప్రయాణికుడికి అనుభూతిని కలిగిస్తాయి.
* ఈ రైళ్లలో పసందైన వంటకాలను అందించేందుకు రైల్వేశాఖ యోచిస్తోంది. అందుకోసం ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ రూపొందించిన మెనూను ప్రయాణికులకు అందించనున్నారు. ఈ మేరకు అతని సంస్థతో రైల్వేశాఖ ఒప్పందం చేసుకోనుంది.
* ప్రతి సీటుకూ ఒక ఎల్సీడీ టీవీతో పాటు హెడ్ఫోన్ను ఉపయోగించేందుకు వీలుగా సాకెట్ ఉంటుంది. దీంట్లో టీవీతో పాటు ప్రయాణికుడు వివరాలు, భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రత్యక్షమవుతుంటాయి.
* ఈ రైలు పెట్టెల్లో ఇంటర్నెట్ను ఉపయోగించుకునేందుకు వీలుగా వైఫై సదుపాయం కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
* టాయిలెట్లో వేరే వ్యక్తి ఉన్నప్పుడు ఆ సమాచారాన్ని తెలిపే బోర్డులు ఉంటాయి. అంతేకాక టాయిలెట్లలో నీటి మట్టాన్ని తెలిపే సూచీలతో పాటు, సెన్సార్తో కూడిన వాటర్ కుళాయిలు, హ్యాండ్ డయ్యర్లు ఉంటాయి.
* దివ్యాంగుల కోసం బ్రెయిలీ లిపితో కూడిన సూచన బోర్డులను కూడా ఈ రైలులో వినియోగిస్తున్నారు.
* టీ, కాఫీ, కూల్డ్రింక్ వెండింగ్ మెషిన్లు ఇందులో ఉంటాయి. దీంతో పాటు మ్యాగజైన్స్, స్నాక్స్ కూడా లభిస్తాయి.
* ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సీసీ కెమెరాలను కూడా బోగీల్లో ఏర్పాటు చేస్తున్నారు.
* మంటలు, పొగ వచ్చినప్పుడు గుర్తించే అత్యాధునిక పరికరాలను ఇందులో పొందుపరిచారు.
* వీటిని కపుర్తలలో రైలు కోచ్ ఫ్యాక్టరీలో ఈ బోగీలను తయారుచేస్తున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







