చైనా - లండన్ గూడ్స్ రైలు.!
- January 04, 2017
దాదాపు 12వేల కిమీ(7400మైళ్లు).. 18రోజుల ప్రయాణం.. చైనా కొత్తగా ప్రారంభించిన గూడ్స్ రైలు ప్రత్యేకతలివి. కజకిస్తాన్, రష్యా, బెలారస్, పోలాండ్, జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ మీదుగా ఈ గూడ్స్ రైలు లండన్ చేరుకుంటుంది. జిజియాంగ్ ప్రావిన్స్ లోని యివు అనే హోల్ సేల్ మార్కెట్ పట్టణం నుంచి ఈ గూడ్స్ రైలును చైనా ప్రారంభించింది. గతంలో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరూన్ తో చేసుకున్న ఒప్పందాల మేరకు చైనా ఈ రైలును ప్రారంభించింది. దీనిపై స్పందిస్తూ చైనాతో వాణిజ్య సంబంధాలు స్వర్ణంగా మిగిలిపోతాయని బ్రిటన్ కొత్త ప్రధాని థెరిసా మే అన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన నేపథ్యంలో.. చైనాతో ఈ సంబంధాలు తమ దేశానికి ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









