చైనా - లండన్ గూడ్స్ రైలు.!
- January 04, 2017
దాదాపు 12వేల కిమీ(7400మైళ్లు).. 18రోజుల ప్రయాణం.. చైనా కొత్తగా ప్రారంభించిన గూడ్స్ రైలు ప్రత్యేకతలివి. కజకిస్తాన్, రష్యా, బెలారస్, పోలాండ్, జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ మీదుగా ఈ గూడ్స్ రైలు లండన్ చేరుకుంటుంది. జిజియాంగ్ ప్రావిన్స్ లోని యివు అనే హోల్ సేల్ మార్కెట్ పట్టణం నుంచి ఈ గూడ్స్ రైలును చైనా ప్రారంభించింది. గతంలో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరూన్ తో చేసుకున్న ఒప్పందాల మేరకు చైనా ఈ రైలును ప్రారంభించింది. దీనిపై స్పందిస్తూ చైనాతో వాణిజ్య సంబంధాలు స్వర్ణంగా మిగిలిపోతాయని బ్రిటన్ కొత్త ప్రధాని థెరిసా మే అన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన నేపథ్యంలో.. చైనాతో ఈ సంబంధాలు తమ దేశానికి ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







