చైనా - లండన్ గూడ్స్ రైలు.!

- January 04, 2017 , by Maagulf
చైనా - లండన్ గూడ్స్ రైలు.!

దాదాపు 12వేల కిమీ(7400మైళ్లు).. 18రోజుల ప్రయాణం.. చైనా కొత్తగా ప్రారంభించిన గూడ్స్ రైలు ప్రత్యేకతలివి. కజకిస్తాన్, రష్యా, బెలారస్, పోలాండ్, జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ మీదుగా ఈ గూడ్స్ రైలు లండన్ చేరుకుంటుంది. జిజియాంగ్ ప్రావిన్స్ లోని యివు అనే హోల్ సేల్ మార్కెట్ పట్టణం నుంచి ఈ గూడ్స్ రైలును చైనా ప్రారంభించింది. గతంలో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరూన్ తో చేసుకున్న ఒప్పందాల మేరకు చైనా ఈ రైలును ప్రారంభించింది. దీనిపై స్పందిస్తూ చైనాతో వాణిజ్య సంబంధాలు స్వర్ణంగా మిగిలిపోతాయని బ్రిటన్ కొత్త ప్రధాని థెరిసా మే అన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చిన నేపథ్యంలో.. చైనాతో ఈ సంబంధాలు తమ దేశానికి ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com