219 మంది భారత జాలర్లను.. విడుదల చేసిన పాక్ ప్రభుత్వం
- January 05, 2017
భారత్కు చెందిన సుమారు 219 మంది జాలర్లను పాకిస్థాన్ గురువారం విడుదల చేసింది. ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు పెంపొందించుకునే దిశగా వీరిని రిలీజ్ చేసినట్లు వెల్లడించింది. వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులకు ఈ మత్స్యకారులను అప్పగించనుంది. వీరిలో చాలా మంది ఏడాదిపైగా పాకిస్థాన్ జైల్లో గడిపారు.
పాకిస్థాన్ ఇటీవల కొందరు జాలర్లను విడుదల చేసింది. అయితే మరో వంద మంది వరకు అక్కడి జైల్లో మగ్గుతున్నారు. భారత హై కమిషన్ వీరి జాతీయతను గుర్తించాల్సి ఉంది. అంతర్జాతీయ జలాల్లోకి పొరపాటున చొరబడే మత్స్యకారులను భారత్, పాక్ అరెస్ట్ చేస్తుంటాయి. అనంతరం గుడ్విల్ గెస్ట్చర్ కింద విడుదల చేస్తుంటాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







