'లయన్స్‌ గోల్డ్‌ అవార్డు' అందుకున్న ఐశ్వర్య

- January 05, 2017 , by Maagulf
'లయన్స్‌ గోల్డ్‌ అవార్డు' అందుకున్న ఐశ్వర్య

బాలీవుడ్‌ నటి ఐశ్వర్యరాయ్‌ 'సరబ్‌జిత్‌' చిత్రంలోని తన పాత్రకు ఉత్తమ నటిగా లయన్స్‌ గోల్డ్‌ అవార్డు గెలుచుకున్నారు. బుధవారం ముంబయి నగర శివారులోని ఓ ఆడిటోరియంలో లయన్స్‌ గోల్డ్‌ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్‌, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్‌ సతీమణి అమృతా ఫడణవిస్‌ ఐశ్వర్యరాయ్‌కు అవార్డు ప్రదానం చేశారు.
నిజ జీవిత సంఘటన ఆధారంగా ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన 'సరబ్‌జిత్‌' చిత్రంలో ఐశ్వర్యరాయ్‌తోపాటు రణ్‌దీప్‌ హుడా, రిచా చద్దా ప్రధాన పాత్రల్లో నటించారు.గత ఏడాది మేలో విడుదలైన ఈ చిత్రం విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com