'లయన్స్ గోల్డ్ అవార్డు' అందుకున్న ఐశ్వర్య
- January 05, 2017
బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ 'సరబ్జిత్' చిత్రంలోని తన పాత్రకు ఉత్తమ నటిగా లయన్స్ గోల్డ్ అవార్డు గెలుచుకున్నారు. బుధవారం ముంబయి నగర శివారులోని ఓ ఆడిటోరియంలో లయన్స్ గోల్డ్ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ సతీమణి అమృతా ఫడణవిస్ ఐశ్వర్యరాయ్కు అవార్డు ప్రదానం చేశారు.
నిజ జీవిత సంఘటన ఆధారంగా ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన 'సరబ్జిత్' చిత్రంలో ఐశ్వర్యరాయ్తోపాటు రణ్దీప్ హుడా, రిచా చద్దా ప్రధాన పాత్రల్లో నటించారు.గత ఏడాది మేలో విడుదలైన ఈ చిత్రం విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







