హెచ్-1బి వీసా రగడ మళ్ళీ మొదలైంది
- January 07, 2017
హెచ్-1బి వీసా రగడ మళ్ళీ మొదలైంది. ట్రంప్ గెలుపుతో అమెరికాలో రిపబ్లికన్ పార్టీ తన ఎజెండాను అమలుచేయడానికి సిద్దమైంది. 'ప్రొటెస్ట్ ఎండ్ గ్రో అమెరికన్ జాత్స యాక్ట్' వేటుతో బిల్లును మరోసారి ప్రవేశపెట్టారు. దీంతో భారతీయిత హెచ్-1బి వీసాల ఆశలు గల్లంతయ్యే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే డిస్నీలాండ్ వంటి కంపెనీలు అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగించి వారి స్థానంలో విదేశీయిల్ని నియమిస్తున్నారనే కారణాలతో ఆ సంస్థలపై తీవ్రమైన దుమారం చెలరేగింది. ఎన్నికల సందర్భంగా ట్రంప్ హెచ్-1బి వీసాల మీద చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఇదిలా వుండగా అమెరికన్ కాంగ్రెస్లో బిల్లు ప్రవేశపెట్టడంతో భారతీయులు ఐటీ సంపెనీల మీద ప్రభావం పడింది.
ఇన్ఫోసిస్, టిసిఎస్, విప్రో వంటి కంపెనీల షేర్ల ధరలు పడ్డాయి. టెక్ మహీంద్ర, హెక్సావేర్ టెక్నాలజీస్, హెచ్సిఎల్ సంస్థల షేర్లు సైతం కిందకు చూస్తున్నాయి. దాదాపు 22 వేల కోట్లు మార్కెట్ వ్యాల్యువేషన్ కోల్పోతున్నట్లు అధికారిక లెక్కలు తెలియచేస్తున్నాయి. హెచ్-1బి వీసాలు పొందటానికి కావాల్సిన అర్హతల్ని మార్చడంతో భారతీయ ఐటి కంపెనీలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నది కొంతకారణంగా వినిపిస్తున్నమాట. సాలీనా లక్ష జనల్లో కనీస వేతనం, మాస్టర్స్ డిగ్రీ కలిగివుండాలనే నిబంధనల్ని బిల్లులో చేర్చడం కూడా భారతీయులకు ప్రతిబంధకాలు కానున్నాయి.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









