మరో దారుణానికి తెగబడ్డ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు
- January 07, 2017
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరో దారుణానికి తెగబడ్డారు. ఇరాక్లో తమ ఆధీనంలో ఉన్న మోసుల్ ప్రాంతంలో తమకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి సమాచారం చేరవేసాడన్న అనుమానంతో ఒక వ్యక్తిని సోపు నీళ్లలో ముంచి చంపివేశారు. వందలాది ప్రజలు చూస్తుండగా నిందితుడిని సోపు నీళ్లతో నిండిన ఈత కొలనులో ముంచివేశారు. గతంలోనూ కొందర్ని అనుమానంతో ఇలాగే చంపివేసిన విషయాలు తెలిసిందే. బతికిఉండగానే మంటల్లో వేసేయడం, భవంతులపై నుంచి తోసివేయడం, శిలువ వేయడం...తదితర ఉన్మాద చర్యలతో సామాన్యులను భయోత్పాతానికి గురిచేస్తున్నారు. గత ఏడాది అక్టోబరు 17న ఇరాకీ ప్రభుత్వ దళాలు, కుర్దు దళాలు అమెరికా వాయుసేన సహకారంతో మోసుల్ విముక్తికి పోరాటం ప్రారంభించాయి. ఇప్పటికే మోసుల్లోని పలు ప్రాంతాలను వారు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా మిగిలిన ప్రాంతాల్లో ఐఎస్ ప్రాబల్యం కొనసాగుతోంది. త్వరలోనే ఈ ప్రాంతాలను స్వాధీనం చేసుకొని ఐఎస్ను తుదముట్టిస్తామని ఇరాకీ ప్రభుత్వ ప్రతినిధులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







