మరో దారుణానికి తెగబడ్డ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు
- January 07, 2017
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరో దారుణానికి తెగబడ్డారు. ఇరాక్లో తమ ఆధీనంలో ఉన్న మోసుల్ ప్రాంతంలో తమకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి సమాచారం చేరవేసాడన్న అనుమానంతో ఒక వ్యక్తిని సోపు నీళ్లలో ముంచి చంపివేశారు. వందలాది ప్రజలు చూస్తుండగా నిందితుడిని సోపు నీళ్లతో నిండిన ఈత కొలనులో ముంచివేశారు. గతంలోనూ కొందర్ని అనుమానంతో ఇలాగే చంపివేసిన విషయాలు తెలిసిందే. బతికిఉండగానే మంటల్లో వేసేయడం, భవంతులపై నుంచి తోసివేయడం, శిలువ వేయడం...తదితర ఉన్మాద చర్యలతో సామాన్యులను భయోత్పాతానికి గురిచేస్తున్నారు. గత ఏడాది అక్టోబరు 17న ఇరాకీ ప్రభుత్వ దళాలు, కుర్దు దళాలు అమెరికా వాయుసేన సహకారంతో మోసుల్ విముక్తికి పోరాటం ప్రారంభించాయి. ఇప్పటికే మోసుల్లోని పలు ప్రాంతాలను వారు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా మిగిలిన ప్రాంతాల్లో ఐఎస్ ప్రాబల్యం కొనసాగుతోంది. త్వరలోనే ఈ ప్రాంతాలను స్వాధీనం చేసుకొని ఐఎస్ను తుదముట్టిస్తామని ఇరాకీ ప్రభుత్వ ప్రతినిధులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!
- గల్ఫ్ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- బహ్రెయిన్ ఓపెన్ టెన్నిస్ ఛాలెంజర్ ప్రారంభం..!!
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్







