పోర్చ్గల్ ప్రజాస్వామ్య పిత సోయారిస్ మృతి...
- January 08, 2017
ఇంటర్నెట్డెస్క్: పోర్చ్గల్ ప్రజాస్వామ్య పితగా భావించే మాజీ అధ్యక్షుడు మారియో సొయారీస్ (92) కన్నుమూశారు. సోయారిస్ 1976-78 మధ్యకాలంలో ఆ దేశ ప్రధానమంత్రిగా పనిచేశారు. 1980లలో మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 1986-96 మధ్యకాలంలో పోర్చ్గల్ అధ్యక్షుడిగా పనిచేశారు. వృద్ధాప్యం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో ఆయన్ను గత నెలలో లిస్బన్లోని ఆసుపత్రిలో చేర్పించారు. తొలుత కోలుకున్నా తర్వాత కోమాలోకి వెళ్లిపోయారు. పోర్చుగల్లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పే క్రమంలో ఆయన్ను సైనిక ప్రభుత్వాలు 12సార్లు జైల్లో ఉంచాయి. 1974 కార్నేషన్ తిరుగుబాటులో ఆయన కీలక పాత్ర పోషించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







