బహ్రైన్ లో భారతీయ కార్మికులపై దౌర్జన్యం - విచారణ చేస్తున్న అధికారులు
- September 11, 2015
బహ్రైన్, సలామాబాద్ లోని ఒక పారిశుధ్య సేవల సంస్థలో పనిచేస్తున్న థామస్ దేవాసియా 32, జితేష్ ఆరాత్తాoకడీ 30, ప్రవీణ్ నారాయణన్ 30 మరియు ఆషేరాఫ్ కున్నోత్ మీథాల్ 41 అనే నలుగురు భారతీయులు, తమ యజమాని తమ పాస్పోర్టులను స్వాధీనం చేసుకొని, తమను కొడుతున్నారని, దుర్భాషలాడుతున్నారని, వేతనాలు కూడా సరిగా చెల్లించడం లేదని భారతీయ దౌత్య కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో, అధికారులు విచారణ చేస్తున్నారు.
ఎంతో ప్రాధేయపడిన మీదట తమ భార్యా, పిల్లల పాస్ పోర్టులను మాత్రం తిరిగి ఇచ్చారని, బతుకు జీవుడా అని స్వదేశానికి వారిని పంపించానని దేవాసియా అనే అతను చెప్పాడు. . అమిత ఉష్ణోగ్రతల వలన కార్మికులు జబ్బులపాలైన పట్టించుకోరని, కండిష న్ లో లేనివి, ఏ. సి. లేని వాహనాలను నడపమని నిర్బంధిస్తారని, తమను నిద్రకూడా పోనీయట్లేదని, నారాయణన్ అనే వ్యక్తి తన పాస్ పోర్టును తిరిగివ్వమని అడిగిన మీదట తీవ్రంగా గాయపరచిన మీదట పరిస్థితి పీకలదాక వచ్చిందని, అందుకే ఫిర్యాదు చేశామని, ఐతే తాను బహ్రైనీయుడైనందువల్ల తనను ఎవరు ఏమీ చేయరని అతను అన్నాడనీ వాపోయారు. ఈ విషయంపై వివరణ ఈయడానికి సదరు కంపెనీ నుండి ఎవరు నోరు మెదపకపొవడo కొసమెరుపు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









