ఇక విమానాల్లో వైఫై
- January 11, 2017
విమానాల్లో కూడా ప్రయాణికులకు వై-ఫై సర్వీసులు అందించేందుకు విమానయానసంస్థలు పోటీపడుతున్నాయి. తాజాగా అలస్కా విమానయాన సంస్థ, తన ప్రయాణికులు ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్నప్పుడే ఉచితంగా ఇన్ స్టాంట్ మెసేజింగ్ యాప్ లు వాడుకునేలా అవకాశం కల్పించేందుకు సిద్ధమైంది. ఉత్తర అమెరికాలో దేశీయ విమానాలు నడుపుతున్న అలస్కా ఎయిర్ లైన్స్, విదేశీ మార్గాలోనూ తన సేవలందిస్తోంది. మెక్సికో, కోస్టా రికా, క్యూబా వంటి ప్రాంతాలకు తన విమానాలను నడుపుతోంది. ఎంపికచేసిన ఇన్ స్టాంట్ మెసేజింగ్ సర్వీసులకు ఆన్ బోర్డులో యాక్సస్ అందించడం ప్రస్తుతం బీటా టెస్టింగ్ లో ఉందని అలస్కా పేర్కొంది. ఎలాంటి అదనపు చార్జీలు చెల్లించాల్సినవసరం లేకుండా 35వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ప్రయాణికులు ఫేస్ బుక్ మెసేంజర్, వాట్సాప్, ఐ మెసేజ్ లను వాడుకోవచ్చని తెలిపింది.
జనవరి 24 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ''గోగో-వైఫై'' అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత కొన్ని సాధారణ స్టెపులను ఫాలో అయి కుటుంబసభ్యులతో, స్నేహితులతో ఇన్ స్టాంట్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్స్ ద్వారా సంభాషణ ప్రారంభించుకోవచ్చని అలస్కా చెప్పింది. ప్రస్తుతం ఇంటర్నెట్ యాక్సస్ ను విమానాల్లో అందించడం ఎయిర్ లైన్ ఇండస్ట్రికి ప్రధాన సవాళ్లుగా నిలుస్తోంది. ఎయిర్ ఫ్రాన్సస్ తాజాగా బోయింగ్ 787 విమానంలో వైఫై సేవలందించింది. కానీ వాటికి చార్జీలు వసూలు చేసింది. ప్రస్తుతం ఎలాంటి చార్జీలు లేకుండా అలస్కా ఎయిర్ లైన్ ఉచిత సేవలందించేందుకు సిద్దమవుతోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







