విడుదలైన 'ఘాజీ' ట్రైలర్
- January 11, 2017
రానా దగ్గుబాటి లేటెస్ట్ చిత్రం 'ఘాజీ'. ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. సరికొత్తగా వుంది ఈ ట్రైలర్. 'యుద్ధం అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించడం కాదు, శత్రువు ప్రాణాలు తీయడం' అనే డైలాగ్తో మొదలయ్యే ఈ ట్రైలర్ వైవిధ్యంగా సాగింది. 1971 ఇండో-పాక్ యుద్ధానికి ముందు జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రమిది 'ఈ పోరాటంలో మెడల్స్ ఉండవు, గుర్తింపు ఉండదు. చరిత్రలో మనం ఉన్నా లేకపోయినా.. విశాఖపట్నం భవిష్యత్తులో, భారతదేశ భవిష్యత్తులో మనం నిలిచిపోతాం.. జైహింద్' అని అప్పటి నావీ అధికారులు చెబుతున్న డైలాగు ఈ సినిమా కధను తెలుయజేస్తుంది. ఇండో-పాక్ యుద్ధం సమయంలో ఘాజీ అనే సబ్ మేరైయన్ పై దాడి జరిగింది.
ఇది చరిత్ర. ఇందులో ఆధారాలను తీసుకొని ఈ చిర్రాన్ని రూపొందిస్తున్నారు. సంకల్ప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తాప్సి, కే కే మేనన్, అతుల్ కులకర్ణి, నాజర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 17న 'ఘాజీ' చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ చిత్రానికి పీవిపీ నిర్మాత.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







