వివేకానందుడి 154 వ జయంతి..
- January 12, 2017
వేదాంత తత్వశాస్త్రాలతో చెరగని ముద్ర వేసిన అత్యంత ప్రభావ శీలి. భారతప్రజానీకానికి కర్మయోగాన్ని, పాశ్చాత్య ప్రపంచానికి జ్ఞానయోగాన్ని అందించిన మహామనిషి. భరతజాతి గొప్పతనాన్ని అంతర్జాతీయ వేదిక పై చాటి చెప్పిన ఐకాన్. యువతకు మార్గదర్శిగా నిలుస్తున్న స్వామి వివేకానంద జయంతి నేడు...
అఖండ భారత ఆధ్యాత్మిక పరంపరకు ప్రతినిధిగా అవతరించిన మహనీయుడు స్వామి వివేకానంద. 1863 జనవరి 12న కలకత్తాలో భువనేశ్వరీ దేవి, విశ్వనాథ్దత్ దంపతులకు జన్మించాడు. నరేంద్రనాథ్ దత్త అని పెట్టినా... ఆయన్ను నరేన్, నరేంద్రుడు అని పిలిచేవారు. వివేకానంద చిన్నతనం నుంచే ధ్యానం చేసేవాడు. భగవంతుడి దర్శనం కోసం పరితపించేవాడు. బ్రహ్మసమాజంలో చేరినప్పటికీ వివేకానందుడికి కావలసిన మార్గం కన్పించలేదు. దీంతో రామకృష్ణ పరమహంసను కలిశాడు. సన్యాసాన్ని స్వీకరించి ఆయనకు అంత్యంత ప్రియశిష్యుడయ్యాడు. పరమహంస ఆదేశం మేరకు అఖండ భారతావనిలో పర్యటించిన వివేకానందుడు నిమ్నజాతుల దీనస్ధితిని చూసి కలత చెందాడు. సేవాభావంతో సాటి మానవుడి బాధలను తొలగించాలని ప్రబోధించాడు. ప్రతిఒక్కరూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకొని, స్వశక్తిపై ఆధారపడినప్పుడే దేశం ప్రగతి సాధిస్తుందని చెప్పిన వివేకానందుడు తన ప్రసంగాలతో సమాజాన్ని జాగృతం చేసిన యోగి. గాంధీజీకి దారి చూపిన దివ్యజ్యోతి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పామరులకు అర్థమయ్యే భాషలో ఘంటానాదంలా పలికిన దీనజన బాంధవుడు. చికాగో సర్వమత సమ్మేళనంలో భారతీయ ఆధ్యాత్మిక వాణిని వినిపించిన మార్గదర్శకుడు. మనిషిని మనీషిగా ఉన్నతస్థితికి తీసుకెళ్లే భావమే మతమనీ, అదే సర్వతోముఖ వికాసానికి దోహదం చేస్తుందని చెప్పిన ఘనత వివేకానందుడిదే. ముక్కోటి దేవతల సమ్మిళిత రూపమే భారతమాత అని ప్రకటించారు. అందుకే నేటికి వివేకానందుడి ఆశయాలు, స్ఫూర్తి ప్రతీ భారతీయుడి హృదయాంతరాలను తట్టిలేపే మహత్తర శక్తిగా నిలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







