వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని గురించి మిత్రదేశాలైన ఒమాన్- చైనా చర్చలు
- September 12, 2015
సుల్తానెట్ ఆఫ్ ఒమాన్ మరియు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాల విదేశాంగ శాఖల మంత్రుల మధ్య తొమ్మిదవ దఫా వ్యూహాత్మక చర్చలు నిన్న మస్కట్ పట్టణంలో జరిగాయి. ఒమాన్ విదేశాంగ శాఖ తరపున సెక్రటరీ జనరల్ సైయిద్ బద్ర్ బిన్ హమాద్ బిన్ హమౌద్ అల్ బుసైదీ, చైనా తరపున విదేశీ వ్యవహారాల ఉపమంత్రి ఝాంగ్ మింగ్ ప్రాతినిధ్యం వహించి, వాణిజ్యం, పెట్టుబడులు, సంస్కృతి, ఆర్ధిక మరియు ఇరు మిత్ర దేశాలకు, ప్రజలకు ఆసక్తికరమైన మరిన్ని విషయాలపై ద్వైపాక్షిక సహకారం, దానిని పెంపొందించుకునే విధానాలపై చర్చలు జరిపారు.
ఇరుదేశాలకు సంబంధించిన ఉమ్మడి అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాల మార్పిడి చేసుకుంటూ, ప్రపంచ దేశాల మధ్య శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడానికి అవసరమైన అన్ని శాంతియుత విధానాలను, సహకారాన్ని బలోపేతం చేయవలసిన ఆవస్యకతను నొక్కి చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో, ఆర్ధిక వ్యవహారాల శాఖ అధికారి - షేక్ యాహ్యా బిన్ అబ్దుల్లా అల్ ఫన్నా, చైనా రాయబారి మరియు ఇరుదేశాల విదేశాంగ శాఖల అధికారులు పాల్గొన్నారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







