వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని గురించి మిత్రదేశాలైన ఒమాన్- చైనా చర్చలు
- September 12, 2015
సుల్తానెట్ ఆఫ్ ఒమాన్ మరియు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాల విదేశాంగ శాఖల మంత్రుల మధ్య తొమ్మిదవ దఫా వ్యూహాత్మక చర్చలు నిన్న మస్కట్ పట్టణంలో జరిగాయి. ఒమాన్ విదేశాంగ శాఖ తరపున సెక్రటరీ జనరల్ సైయిద్ బద్ర్ బిన్ హమాద్ బిన్ హమౌద్ అల్ బుసైదీ, చైనా తరపున విదేశీ వ్యవహారాల ఉపమంత్రి ఝాంగ్ మింగ్ ప్రాతినిధ్యం వహించి, వాణిజ్యం, పెట్టుబడులు, సంస్కృతి, ఆర్ధిక మరియు ఇరు మిత్ర దేశాలకు, ప్రజలకు ఆసక్తికరమైన మరిన్ని విషయాలపై ద్వైపాక్షిక సహకారం, దానిని పెంపొందించుకునే విధానాలపై చర్చలు జరిపారు.
ఇరుదేశాలకు సంబంధించిన ఉమ్మడి అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాల మార్పిడి చేసుకుంటూ, ప్రపంచ దేశాల మధ్య శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించడానికి అవసరమైన అన్ని శాంతియుత విధానాలను, సహకారాన్ని బలోపేతం చేయవలసిన ఆవస్యకతను నొక్కి చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో, ఆర్ధిక వ్యవహారాల శాఖ అధికారి - షేక్ యాహ్యా బిన్ అబ్దుల్లా అల్ ఫన్నా, చైనా రాయబారి మరియు ఇరుదేశాల విదేశాంగ శాఖల అధికారులు పాల్గొన్నారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







