బిహార్ రాజధానిలో పడవ బోల్తా: 18 మంది మృతి
- January 14, 2017
బిహార్ రాజధాని పాట్నాలో శనివారం ఘోర ప్రమాదం సంభవించింది. గంగానదిలో 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో 18 మంది మృతిచెందగా మిగతా ప్రయాణికులు గాయపడ్డారు. కైట్ ఫెస్టివల్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రెవెన్యూ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. పడవలో పరిమితికి మిచ్చి ప్రయాణికులు ఎక్కడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. బిహార్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







