పంజాబ్ మాజీ సీఎం కన్నుమూత
- January 14, 2017
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి సూర్జిత్సింగ్ బర్నాలా శనివారం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఛండీగఢ్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 91 ఏళ్లు. బర్నాలా అక్టోబర్ 21, 1925లో హరియాణాలోని అటేలీలో జన్మించారు. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నారు.
1952లో జరిగిన ఎన్నికల్లో పోటీచేసినప్పటికీ ఓటమిపాలయ్యారు. అనంతరం 1977లో పార్లమెంట్కు ఎన్నికయ్యారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖామంత్రిగా కూడా సేవలందించారు. అనంతరం 1985 నుంచి 1987 వరకు పంజాబ్ ముఖ్యమంత్రి గానూ ఉన్నారు.
2000 నుంచి 2011 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్ గవర్నర్గా సేవలందించారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









