పంజాబ్‌ మాజీ సీఎం కన్నుమూత

- January 14, 2017 , by Maagulf
పంజాబ్‌ మాజీ సీఎం కన్నుమూత

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి సూర్జిత్‌సింగ్‌ బర్నాలా శనివారం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఛండీగఢ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 91 ఏళ్లు. బర్నాలా అక్టోబర్‌ 21, 1925లో హరియాణాలోని అటేలీలో జన్మించారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నారు.

1952లో జరిగిన ఎన్నికల్లో పోటీచేసినప్పటికీ ఓటమిపాలయ్యారు. అనంతరం 1977లో పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖామంత్రిగా కూడా సేవలందించారు. అనంతరం 1985 నుంచి 1987 వరకు పంజాబ్‌ ముఖ్యమంత్రి గానూ ఉన్నారు.

2000 నుంచి 2011 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, ఉత్తరాఖండ్‌ గవర్నర్‌గా సేవలందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com