పంజాబ్ మాజీ సీఎం కన్నుమూత
- January 14, 2017
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి సూర్జిత్సింగ్ బర్నాలా శనివారం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఛండీగఢ్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 91 ఏళ్లు. బర్నాలా అక్టోబర్ 21, 1925లో హరియాణాలోని అటేలీలో జన్మించారు. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నారు.
1952లో జరిగిన ఎన్నికల్లో పోటీచేసినప్పటికీ ఓటమిపాలయ్యారు. అనంతరం 1977లో పార్లమెంట్కు ఎన్నికయ్యారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖామంత్రిగా కూడా సేవలందించారు. అనంతరం 1985 నుంచి 1987 వరకు పంజాబ్ ముఖ్యమంత్రి గానూ ఉన్నారు.
2000 నుంచి 2011 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్ గవర్నర్గా సేవలందించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







