వాట్సాప్ 'ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్'లో లోపం
- January 15, 2017
ప్రముఖ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్'లో ప్రవేశపెట్టిన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్లో లోపం ఉందని పరిశోధకులు ఆరోపిస్తున్నారు. ఎన్క్రిప్షన్ను అందుబాటులోకి తెచ్చిన తర్వాత తమ ఉద్యోగులు సైతం వినియోగదారుల మెసేజ్లను చదివే వీలుండదని వాట్సాప్ ఇప్పటివరకూ చెబుతూ వచ్చింది. దాంతో వినియోగదారుల భద్రతకు ఢోకా ఉండదని తెలిపింది. కానీ.. అందులో వాస్తవం లేదని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన సెక్యూరిటీ పరిశోధకుడు తోబియాస్ బోఎల్టర్ అంటున్నారు. ఎన్క్రిప్షన్లో వినియోగించే సెక్యూరిటీ 'కీ'లో మార్పులు చేసి మూడో వ్యక్తి మెసేజ్లను చదివే వీలుంటుందని చెబుతున్నారు.
ఎదుటి వ్యక్తి ఆఫ్లైన్లో ఉన్నప్పుడు మెసేజ్లను పంపితే.. ఆ మెసేజ్లకు సంబంధించిన సెక్యూరిటీ 'కీ'లను వాట్సాప్ సిబ్బంది మార్చేసే వీలుందట. అలా మార్చిన విషయం మెసేజ్ను పంపిన వ్యక్తికి.. రిసీవ్ చేసుకోవాల్సిన వ్యక్తికీ తెలియదట. అలాంటి సందర్భాల్లో మూడో వ్యక్తి ఆ మెసేజ్లను చదివే వీలుంటుందని తొబియాస్ అంటున్నారు. అలా సమాచార మార్పిడిపై నిఘా పెట్టడం వినియోగదారుడి వాక్ స్వాతంత్య్రాన్ని దెబ్బతీయడమేనని ఆరోపిస్తున్నారు. ఈ సెక్యూరిటీ లోపానికి సంబంధించిన విషయాలను ప్రముఖ ఆంగ్ల పత్రిక 'ది గార్డియన్' ద్వారా ఆయన బయటపెట్టారు.
అయితే.. అలా మెసేజ్లను మూడో వ్యక్తి చదవడం అరుదుగా ఉంటుందని వాట్సాప్ ప్రతినిధి ఒకరు తెలిపారు. వినియోగదారులు ఫోన్లు మార్చినప్పుడు.. వాట్సాప్ను రీ-ఇన్స్టాల్ చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందన్నారు. అందరూ వాట్సాప్లో ఉన్న సెక్యూరిటీ సెట్టింగ్స్లోని ''షో సెక్యూరిటీ నోటిఫికేషన్స్'ను ఆన్లో ఉంచుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







