విజిట్ వీసాతో వచ్చి బహ్రెయిన్లో మృతిచెందిన మహిళ..
- January 16, 2017
65 ఏళ్ళ మహిళ ఒకరు బహ్రెయిన్కి విజిట్ వీసాపైన వచ్చి, గుండెపోటుతో మరణించారు. భారతదేశంలోని కేరళకు చెందిన 65 ఏళ్ళ శారద శంకర్, అద్లియాలో తన కుమారుడు నివాసం ఉంటున్న అకామడేషన్కి వచ్చారు. దురదృష్టవశాత్తూ ఆమెకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. మృతురాలి ఇద్దరి కుమారులు సుధీష్ కుమార్, సురేష్బాబు బహ్రెయిన్లోనే ఉన్నారు. ఆమెకు మొత్తం ఐదుగురు సంతానం. స్నేహితురాలు నారాయణితో కలిసి బహ్రెయిన్కి వచ్చారు శారద. పాస్పోర్ట్ సమస్యలతో ఆమె తిరుగు ప్రయాణం కాస్త ఆలస్యమవగా, ఇంతలోనే ఆమెను మృత్యువు వెంటాడింది. డిసెంబర్ 26న నారాయణి బహ్రెయిన్కి రాగా, జనవరి 13న శారద బహ్రెయిన్కి చేరుకున్నారు. నారాయణి, శారద ఇద్దరూ సుధీష్కుమార్ ఫ్లాట్లోనే ఉండేవారు. టీవీ చూస్తుండగా, గుండెపోటు రావడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయారు. సలామియా మెడికల్ కాంప్లెక్స్ మార్చురీలో శారద మృతదేహాన్ని భద్రపరిచారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







