విజయవాడ బ్రాండ్ అంబాసిడర్గా కోనేరు హంపి..
- January 16, 2017
స్వచ్ఛ సర్వేక్షణ్కు విజయవాడ బ్రాండ్ అంబాసిడర్గా 'చెస్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపిని ఎంపిక చేసినట్టు మేయర్ కోనేరు శ్రీధర్ తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ హెల్ప్లైన నుంచి వచ్చే ఫోన్ ద్వారా అమితాబ్ ప్రసంగం వినిపిస్తుందని, నగర సంబంధిత స్వచ్ఛతా యాప్ ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయడంలో భాగంగా హంపి ప్రసంగం ఉంటుందని తెలిపారు. సోమవారం ఆయన తన చాంబర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విజయవాడ బ్రాండ్ అంబాసిడర్గా తన సేవలను అందించేందుకు అంగీకరించిన హంపికి కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్-2017 కార్యక్రమానికి నగర ప్రజలందరూ సహకరించాలని కోరారు.
జనవరి 17 నుంచి 19వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ బృందం నగరంలో పర్యటిస్తుందన్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, మార్కెట్ తదితర ప్రాంతాలను బృంద సభ్యులు పరిశీలిస్తారని తెలిపారు. పారిశుధ్య నిర్వహణ, అభివృద్ధిపై నగర ప్రజల అభిప్రాయాలు సేకరిస్తారని పేర్కొన్నారు. గత సంవత్సరం 'స్వచ్ఛ సర్వేక్షణ్' కార్యక్రమంలో మైసూరు మొదటిస్థానంలో నిలువగా విజయవాడ 23వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని మేయర్ గుర్తుచేశారు. ఈ ఏడాది నగరాన్ని మొదటి స్థానంలో నిలబెట్టేందుకు ప్రజలు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమం అనంతరం కోనేరు హంపిని మేయర్ శాలువా కప్పి గౌరవించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గోగుల వెంకటరమణ, అదనపు మునిసిపల్ కమిషనర్ (జనరల్) పి.అరుణ్బాబు, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గోపీనాయక్ పాల్గొన్నారు.
రెండేళ్ల నుంచి 'స్వచ్ఛభారత్'లో పాల్గొంటున్నా..
రెండేళ్ల నుంచి 'స్వచ్ఛ భారత' కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. చల్లపల్లి, అవనిగడ్డలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నాను. విజయవాడకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసేందుకు సిద్ధమయ్యాను. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్ఫూర్తితో కార్యక్రమాల్లో పాల్గొంటున్నానే తప్ప రాజకీయాలపై ఎటువంటి ఆసక్తి లేదు. జనవరి మొదటి వారంలోనే టోర్నమెంట్ పూర్తి చేసుకుని వచ్చాను. తదుపరి షెడ్యూల్ను సిద్ధం చేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం 'స్వచ్ఛ సర్వేక్షణ' కార్యక్రమానికి విజయవాడ బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతాను.
కోనేరు హంపి, చెస్ గ్రాండ్ మాస్టర్
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







