కడీ పకోడీ..
- January 17, 2017
కావలసిన పదార్థాలు: శెనగపిండి- 120 గ్రాములు, వాము, పసుపు, కారం, మెంతులు, ధనియాలపొడి, సోంపు- అరటీస్పూను, పెరుగు- 150 గ్రాములు, ఉల్లిగడ్డ(సన్నగా తరిగి)- సగం, కొత్తిమీర తరుగు, జీలకర్ర- ఒకటీస్పూను చొప్పున, ఎండుమిరపకాయలు- ఆరు, ఆవనూనె- మూడు టేబుల్స్పూన్లు, కరివేపాకు- ఎనిమిది రెబ్బలు, పచ్చిమిర్చి చీలికలు- మూడు, ఇంగువ- చిటికెడు, ఉప్పు- తగినంత.
తయారీ విధానం: ఒక గిన్నెలో పెరుగు, ఒకటిన్నర కప్పు నీళ్లు, శెనగపిండి సగం, కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పాన్లోకి తీసుకొని ఇరవై నిమిషాలపాటు చిన్నమంటపై ఉడికించాలి. మరొక పాన్లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి మూడు, సోంపు, ధనియాలపొడి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ వేగించాలి. దీనిలో శెనగపిండి,పెరుగు మిశ్రమం వేసి ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. వేరొక గిన్నెలో మిగిలిన శెనగపిండి, వాము, కారం, పసుపు, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో చిన్న చిన్న ఉండలు చేసి గారెల్లా వత్తుకొని నూనెలో కాల్చాలి. వీటిని శెనగపిండి పెరుగు మిశ్రమంలో వేయాలి. అంతే పంజాబీ సంక్రాంతి స్పెషల్ కడీ పకోడీ రెడీ.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









