ఇస్రో శాస్త్రజ్ఞులు మన దేశానికి పేరు, కోట్ల ఆదాయం తెస్తోన్న ఇస్రో...
- January 18, 2017
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తన ప్రయోగాల పరంపరలో మరో అద్భుతాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో ఆవిష్కరించనున్నది.. పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా 1,392 కిలోల బరువు కలిగిన 103 ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. దీనికి సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ కమిటీ ఛైర్మన్ బీఎన్ సురేష్ ఆద్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఇస్రో రోదసీలోకి పంపనున్న 103 ఉపగ్రహాల్లో దేశీయంగా కార్టోశాట్-2 సిరీస్, రెండు ఇస్రో నానో శాటిలైట్లతోపాటు నెదర్లాండ్, స్విట్జర్లాండ్, అమెరికాకు చెందిన 100 చిన్నతరహా ఉపగ్రహాలు ఉన్నాయి. ఇందుకోసం షార్లోని మొదటి ప్రయోగ వేదికపై ఇప్పటికే మూడు దశల రాకెట్ అనుసంధాన పనులను పూర్తి చేశారు. ఉపగ్రహాలు రాగానే నాలుగోదశ పనులు పూర్తి చేసి కౌంట్ డౌన్ ప్రారంభిస్తారు.. ఒకే సారి అత్యధిక ఉపగ్రహాల్ని పంపిన మొదటి దేశంగా భారత్ ఆవిర్భించబోతున్నది.. కాగా మన దేశానికి పేరు తెస్తూ... దాదాపు 1500 కోట్ల ఆదాయాన్ని కూడా తెస్తోన్న ఇస్రో శాస్త్రజ్ఞుల ఘనతను మనం సగర్వంగా చాటి చెబుదాం.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









