ఇస్రో శాస్త్రజ్ఞులు మన దేశానికి పేరు, కోట్ల ఆదాయం తెస్తోన్న ఇస్రో...
- January 18, 2017
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తన ప్రయోగాల పరంపరలో మరో అద్భుతాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో ఆవిష్కరించనున్నది.. పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా 1,392 కిలోల బరువు కలిగిన 103 ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. దీనికి సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ కమిటీ ఛైర్మన్ బీఎన్ సురేష్ ఆద్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఇస్రో రోదసీలోకి పంపనున్న 103 ఉపగ్రహాల్లో దేశీయంగా కార్టోశాట్-2 సిరీస్, రెండు ఇస్రో నానో శాటిలైట్లతోపాటు నెదర్లాండ్, స్విట్జర్లాండ్, అమెరికాకు చెందిన 100 చిన్నతరహా ఉపగ్రహాలు ఉన్నాయి. ఇందుకోసం షార్లోని మొదటి ప్రయోగ వేదికపై ఇప్పటికే మూడు దశల రాకెట్ అనుసంధాన పనులను పూర్తి చేశారు. ఉపగ్రహాలు రాగానే నాలుగోదశ పనులు పూర్తి చేసి కౌంట్ డౌన్ ప్రారంభిస్తారు.. ఒకే సారి అత్యధిక ఉపగ్రహాల్ని పంపిన మొదటి దేశంగా భారత్ ఆవిర్భించబోతున్నది.. కాగా మన దేశానికి పేరు తెస్తూ... దాదాపు 1500 కోట్ల ఆదాయాన్ని కూడా తెస్తోన్న ఇస్రో శాస్త్రజ్ఞుల ఘనతను మనం సగర్వంగా చాటి చెబుదాం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







