30,000 దిర్హామ్‌ల లంచం తీసుకున్న ఎమిరేటీ అధికారి..

- January 18, 2017 , by Maagulf
30,000 దిర్హామ్‌ల లంచం తీసుకున్న ఎమిరేటీ అధికారి..

జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెసిడెన్సీ అండ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ అధికారి 30,000 దిర్హామ్‌ల లంచం 9 మంది వ్యక్తుల నుంచి తీసుకున్నట్లుగా తేలింది. ఎగ్జిట్‌ పాస్‌లు ఇచ్చేందుకుగాను ఆ అధికారి ఈ లంచాన్ని తీసుకున్నారు. కోర్ట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ ఇన్‌స్టాన్స్‌, 35 ఏళ్ళ ఎమిరేటీ అధికారిని దోషిగా తేల్చింది. ఫాలో అప్‌ అండ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో ఈ అధికారి పనిచేస్తున్నారు. 445,700 దిర్హామ్‌ల విలువైన ఎక్స్‌పైర్డ్‌ రెసిడెన్సీ వీసా మరియు డిపాచ్యూర్‌ ఫీజుల్ని మాఫీ చేసేందుకుగాను ఆ అధికారి లంచం తీసుకున్నారు. 2015, డిసెంబర్‌ 24 నాటి ఘటన ఇది. ఈ ఘటనలో మధ్యవర్తిగా వ్యవహరించిన 35 ఏళ్ళ బంగ్లాదేశీ వ్యక్తిపైనా అభియోగాలు నమోదయ్యాయి. లంచం ఇవ్వజూపినవారిలో నలుగురు బంగ్లాదేశీలు, ఇద్దరు పాకిస్తానీలు, ఇద్దరు ఇండియన్స్‌ ఉన్నారు. చట్ట వ్యతిరేకంగా ఎగ్జిట్‌ పాస్‌లు ఇవ్వడం, ఫోర్జరీకి పాల్పడటం తదితర నేరాలు నిందితుడిపై మోపబడ్డాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com