సాయం కోసం బహ్రెయిన్లో హౌస్మెయిడ్ ఎదురుచూపులు..
- January 18, 2017
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మెయిడ్, స్వదేశానికి వెళ్ళేందుకు తగిన ఆర్థిక వనరులు లేక, అనారోగ్యంతో బహ్రెయిన్లో తల్లడిల్లిపోతున్నారు. 32 ఏళ్ళ గుడివాడ కుమారి అనే మహిళ, కొండ్రు వెంకట్ అనే ఇండియన్ ఏజెంట్ ద్వారా బహ్రెయిన్కి చేరారు. ఎన్నో ఆశలతో బహ్రెయిన్కి చేరుకున్న కుమారికి, ఇక్కడి పరిస్థితులు అగమ్యగోచరంగా తయారవడంతో సమాచారాన్ని తన తల్లికి చేరవేశారు. దాంతో ఆమె తల్లి జయమ్మ, బహ్రెయిన్లోని ఇండియన్ ఎంబసీకి ఫిర్యాదు చేశారు. కుమారి యజమాని, ఆమె పాస్పోర్ట్ని, అలాగే డబ్బునీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, మేన్ పవర్ ఏజెన్సీ మాత్రం, డిపాచ్యూర్ కోసం ఏజెంట్ పర్మిషన్ని కోరుతోంది. అయితే ఏజెంట్ కొండ్రు వెంకట్ మాత్రమే అక్కడే ఆమె పనిచేయాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారు. లక్ష రూపాయల్ని చెల్లిస్తేగానీ తన కుమార్తెను స్వదేశానికి రానివ్వబోనని ఏజెంట్ బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు బాధితురాలి తల్లి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. భారతదేశానికి చెందిన ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి గుడివాడ కుమారి. ఆమెకు భర్త ఏడు కొండలు, ఇద్దర పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం కుమారి అచేతనావస్థలో తనకు సాయం చేసేవారి కోసం ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







