సాయం కోసం బహ్రెయిన్లో హౌస్మెయిడ్ ఎదురుచూపులు..
- January 18, 2017
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మెయిడ్, స్వదేశానికి వెళ్ళేందుకు తగిన ఆర్థిక వనరులు లేక, అనారోగ్యంతో బహ్రెయిన్లో తల్లడిల్లిపోతున్నారు. 32 ఏళ్ళ గుడివాడ కుమారి అనే మహిళ, కొండ్రు వెంకట్ అనే ఇండియన్ ఏజెంట్ ద్వారా బహ్రెయిన్కి చేరారు. ఎన్నో ఆశలతో బహ్రెయిన్కి చేరుకున్న కుమారికి, ఇక్కడి పరిస్థితులు అగమ్యగోచరంగా తయారవడంతో సమాచారాన్ని తన తల్లికి చేరవేశారు. దాంతో ఆమె తల్లి జయమ్మ, బహ్రెయిన్లోని ఇండియన్ ఎంబసీకి ఫిర్యాదు చేశారు. కుమారి యజమాని, ఆమె పాస్పోర్ట్ని, అలాగే డబ్బునీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా, మేన్ పవర్ ఏజెన్సీ మాత్రం, డిపాచ్యూర్ కోసం ఏజెంట్ పర్మిషన్ని కోరుతోంది. అయితే ఏజెంట్ కొండ్రు వెంకట్ మాత్రమే అక్కడే ఆమె పనిచేయాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారు. లక్ష రూపాయల్ని చెల్లిస్తేగానీ తన కుమార్తెను స్వదేశానికి రానివ్వబోనని ఏజెంట్ బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు బాధితురాలి తల్లి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. భారతదేశానికి చెందిన ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి గుడివాడ కుమారి. ఆమెకు భర్త ఏడు కొండలు, ఇద్దర పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం కుమారి అచేతనావస్థలో తనకు సాయం చేసేవారి కోసం ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!









