రెండో రౌండ్కు చేరుకున్న సానియా, బోపన్న జోడీలు
- January 18, 2017
ఆస్ట్రేలియా ఓపెన్లో భారత టెన్నిస్ క్రీడాకారులు శుభారంభం చేశారు. తమ భాగస్వాములతో కలిసి సానియా మీర్జా, రోహన్ బోపన్న విజయాలు సాధించారు. మహిళల డబుల్స్ తొలిరౌండ్లో సానియా, స్ట్రికోవా (చెక్) జోడీ 6-3, 6-1తో బ్రిటిష్ ద్వయం జాస్లిన్ , అన్నా స్మిత్ను చిత్తుచేసింది. తొలి సెట్లో బలమైన ఫోర్హ్యాండ్ షాట్లతో విరుచుకుపడ్డ సానియా జంట రెండో సెట్లో పూర్తిగా దూకుడుగా ఆడింది.
రెండో రౌండ్కు బోపన్న
పురుషుల డబుల్స్లో రోహన్ బోపన్న, పాబ్లో క్యూవస్ (ఉరుగ్వే) జోడీరెండో రౌండ్కు చేరుకొంది. తొలిరౌండ్లో థామస్ బెల్లూసీ (బ్రెజిల్), మాక్సిమో గొంజాలెజ్ (అర్జెంటీనా) ద్వయాన్ని 6-4, 7-6(4) తేడాతో వరుస సెట్లలో మట్టికరిపించింది. పురవ్రాజా, దివిజ్ శరణ్ జోడీ తొలి రౌండ్లో ఫ్రెంచ్ ద్వయం జొనాథన్ ఎస్సెరిక్, ఫాబ్రిస్ మార్టిన్తో, లియాండర్ పేస్, ఆండ్రూ సా జోడీ ట్రీట్ హుయె, మాక్స్ మిర్నీ ద్వయంతో తలపడనుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







