రెండో రౌండ్‌కు చేరుకున్న సానియా, బోపన్న జోడీలు

- January 18, 2017 , by Maagulf
రెండో రౌండ్‌కు చేరుకున్న సానియా, బోపన్న జోడీలు

ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత టెన్నిస్‌ క్రీడాకారులు శుభారంభం చేశారు. తమ భాగస్వాములతో కలిసి సానియా మీర్జా, రోహన్‌ బోపన్న విజయాలు సాధించారు. మహిళల డబుల్స్‌ తొలిరౌండ్లో సానియా, స్ట్రికోవా (చెక్‌) జోడీ 6-3, 6-1తో బ్రిటిష్‌ ద్వయం జాస్లిన్‌ , అన్నా స్మిత్‌ను చిత్తుచేసింది. తొలి సెట్‌లో బలమైన ఫోర్‌హ్యాండ్‌ షాట్లతో విరుచుకుపడ్డ సానియా జంట రెండో సెట్లో పూర్తిగా దూకుడుగా ఆడింది.

రెండో రౌండ్‌కు బోపన్న 

పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న, పాబ్లో క్యూవస్‌ (ఉరుగ్వే) జోడీరెండో రౌండ్‌కు చేరుకొంది. తొలిరౌండ్లో థామస్‌ బెల్లూసీ (బ్రెజిల్‌), మాక్సిమో గొంజాలెజ్‌ (అర్జెంటీనా) ద్వయాన్ని 6-4, 7-6(4) తేడాతో వరుస సెట్లలో మట్టికరిపించింది. పురవ్‌రాజా, దివిజ్‌ శరణ్‌ జోడీ తొలి రౌండ్లో ఫ్రెంచ్‌ ద్వయం జొనాథన్‌ ఎస్సెరిక్‌, ఫాబ్రిస్‌ మార్టిన్‌తో, లియాండర్‌ పేస్‌, ఆండ్రూ సా జోడీ ట్రీట్‌ హుయె, మాక్స్‌ మిర్నీ ద్వయంతో తలపడనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com