రక్తస్రావానికి కరెంటుతో ట్రీట్మెంట్...!
- January 18, 2017
శరీరం మీద గాయమైతే వెంటనే ఏం చేస్తాం. కట్టుకట్టడం ద్వారా రక్తస్రావాన్ని అడ్డుకుంటాం. కానీ భవిష్యత్తులో అలాంటి అవసరం ఉండదు. పైగా కట్టు వల్ల శరీరం మీద గాయం నుంచి మాత్రమే రక్తస్రావాన్ని అరికట్టగలం. కానీ శరీరంలోపల ఏదైనా అవయవం నుంచి రక్తం కారితే అది ప్రాణాంతకమే. అందుకే ఫెయిన్ స్టీన్ ఇన్సిట్యూట్కి చెందిన పరిశోధకులు బయో ఎలక్ట్రిక్ విధానాన్ని రూపొందించారు. ఓ చిన్న పరికరాన్ని శరీరం మీద ఉంచి దాని ద్వారా కరెంటుని శరీరంలోని వేగస్ అనే ప్రధాన నరానికి ప్రవహింపజేస్తారు.
ఈ నాడి మెదడు, గుండె, ఊపిరితిత్తులు వంటి ప్రధాన అవయవాలన్నింటికీ అనుసంధానమై ఉంటుంది. దాంతో కరెంటు దీన్ని చేరిన వెంటనే ప్లీహాన్ని ప్రేరేపించి రక్తం గడ్డకట్టే ప్లేట్లెట్ కణాలను సంబంధిత భాగానికి పంపించేలా చేస్తుంది. తద్వారా గాయం నుంచి రక్తప్రవాహం ఆగుతుంది. గతంలో దీన్ని పందుల్లో ప్రయోగించి చూడగా అది యాభై శాతం రక్తస్రావాన్ని అడ్డుకోగలిగింది.
దాంతో మరింత లోతుగా పరిశోధన చేసి పూర్తిస్థాయిలో రక్తస్రావాన్ని అడ్డుకోగలిగారు. కాబట్టి ఈ పరిశోదన వల్ల భవిష్యత్తులో శస్త్ర చికిత్సలు మరింత సులభతరం కానున్నాయనీ, అలాగే అంతర్గత రక్తస్రావం కారణంగా నమోదయ్యే మరణాల శాతం తగ్గుతుందనీ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









