రక్తస్రావానికి కరెంటుతో ట్రీట్మెంట్...!
- January 18, 2017
శరీరం మీద గాయమైతే వెంటనే ఏం చేస్తాం. కట్టుకట్టడం ద్వారా రక్తస్రావాన్ని అడ్డుకుంటాం. కానీ భవిష్యత్తులో అలాంటి అవసరం ఉండదు. పైగా కట్టు వల్ల శరీరం మీద గాయం నుంచి మాత్రమే రక్తస్రావాన్ని అరికట్టగలం. కానీ శరీరంలోపల ఏదైనా అవయవం నుంచి రక్తం కారితే అది ప్రాణాంతకమే. అందుకే ఫెయిన్ స్టీన్ ఇన్సిట్యూట్కి చెందిన పరిశోధకులు బయో ఎలక్ట్రిక్ విధానాన్ని రూపొందించారు. ఓ చిన్న పరికరాన్ని శరీరం మీద ఉంచి దాని ద్వారా కరెంటుని శరీరంలోని వేగస్ అనే ప్రధాన నరానికి ప్రవహింపజేస్తారు.
ఈ నాడి మెదడు, గుండె, ఊపిరితిత్తులు వంటి ప్రధాన అవయవాలన్నింటికీ అనుసంధానమై ఉంటుంది. దాంతో కరెంటు దీన్ని చేరిన వెంటనే ప్లీహాన్ని ప్రేరేపించి రక్తం గడ్డకట్టే ప్లేట్లెట్ కణాలను సంబంధిత భాగానికి పంపించేలా చేస్తుంది. తద్వారా గాయం నుంచి రక్తప్రవాహం ఆగుతుంది. గతంలో దీన్ని పందుల్లో ప్రయోగించి చూడగా అది యాభై శాతం రక్తస్రావాన్ని అడ్డుకోగలిగింది.
దాంతో మరింత లోతుగా పరిశోధన చేసి పూర్తిస్థాయిలో రక్తస్రావాన్ని అడ్డుకోగలిగారు. కాబట్టి ఈ పరిశోదన వల్ల భవిష్యత్తులో శస్త్ర చికిత్సలు మరింత సులభతరం కానున్నాయనీ, అలాగే అంతర్గత రక్తస్రావం కారణంగా నమోదయ్యే మరణాల శాతం తగ్గుతుందనీ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







