జల్లికట్టు పోరాటానికి కోటి రూపాయలైనా ఇస్తా: నటుడు లారెన్స్..
- January 18, 2017
జల్లికట్టు కోసం పోరాడుతున్న విద్యార్థులకు బాసటగా నిలుస్తూ నటుడు, దర్శకుడు లారెన్స్ బుధవారం మధ్యాహ్నం మెరీనా తీరానికి వెళ్లారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులతో కలిసి నినాదాలు చేశారు. అంతేకాదు, ఈ పోరాటంలో పాల్గొనే వారి ఆకలి దప్పుల కోసం కోటి రూపాయలు ఖర్చయినా తాను భరిస్తానని ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఆయన మాట్లాడుతూ... 'జల్లికట్టు కోసం తమిళులందరూ ఒక్కటయ్యారు. ఇదే మనకి సగం విజయం. నటీనటులందరూ జల్లికట్టుకి మద్ధతు తెలుపుతుండడం హర్షణీయం. నిన్న (మంగళవారం) నాకు ఒక సందేశం వచ్చింది. పోరాటంలో పాల్గొన్న వారికి ఆహారం, మంచినీళ్లు లభించడం లేదని. వరదలు వచ్చినప్పుడు సాయం చేశాం.
ఈ పోరాటానికీ చేస్తాం. కోటి రూపాయలు ఖర్చయినా ఇవ్వడానికి సిద్ధం. జల్లికట్టు తమిళ సంప్రదాయానికి అద్దం పట్టే క్రీడ. దానిని జరుపుకోకుండా అడ్డుపడే విదేశీ శక్తులను అడ్డుకోవాలి.
జల్లికట్టు నిర్వాహకుల నుంచి విద్యార్థులు, సినీ కళాకారుల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇది న్యాయమైనది. రాష్ట్ర ప్రభుత్వం జల్లికట్టుని జరపాలనే తీర్మానాలు చేసింది. అయినప్పటికీ కేంద్రం ఇంకా పూర్తిగా దృష్టి సారించాలి.
విద్యార్థుల పోరాటాన్ని చూసి కేంద్రం దిగొస్తే మంచిది' అని లారెన్స్ ఆవేశంగా మాట్లాడారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







