ప్రధాని మోదీని కలిసిన పన్నీర్సెల్వం..
- January 18, 2017
దిల్లీ: తమిళుల సాంప్రదాయ క్రీడ జల్లికట్టుపై పంచాయతీ దిల్లీకి చేరింది. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. జల్లికట్టుపై నిషేధం తొలగించేలా ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రధానిని కోరారు. ఈ విషయంతో త్వరితగతిన నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రంలో శాంతిభద్రల సమస్య తలెత్తే అవకాశం ఉందని ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు.
జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధం విధించడంతో తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి చెన్నైలోని మెరీనా బీచ్కు ప్రజలు తరలివస్తున్నారు. శాంతియుత పద్ధతిలో తమ ఆందోళన కొనసాగిస్తున్నారు.
వీరికి మద్దతుగా పలువురు సినీనటులు కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







