రోమ్ హోటల్ లో దారుణం, 30 మంది మృతి
- January 19, 2017
రోమ్: ఇటలీలో ప్రకృతి ప్రకోపానికి 30మంది బలైనట్లు తెలుస్తోంది. ఓ పర్వతం పక్కనే ఉన్న హోటల్పై ఓ భారీ కొండచరియ విరిగి పడటంతో వారంతా మృత్యువాత పడినట్లు సమాచారం. అంతకుముందు రోజు ఏర్పడిన భూకంపాలే ఈ దుర్ఘటనకు కారణమని తెలుస్తోంది. ఇటలీ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం నాలుగుసార్లు శక్తిమంతమైన ప్రకంపనలు వచ్చాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్ని ఈ భూప్రకంపనల కారణంగా కొన్ని క్షణాలపాటు వణికిపోయాయి.
అదే సమయంలో గ్రాన్ సాసో పర్వతం పక్కనే రిగోపియానో అనే హోటల్పై దాదాపు రెండు మీటర్ల వెడల్పు, ఆరు అడుగుల ఎత్తుతో ఓ భారీ మంచుకొండచరియ విరిగి పడింది. దీంతో అందులో పనిచేసే సిబ్బంది, అతిథులు, ఇతరులు మొత్తం 30మంది వరకు దీనికింద పడి నలిగిపోయారు. ఇంకా ఎక్కువమందే చనిపోయి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆ పర్వతాల్లో గస్తీ కాసే పోలీసులు వెంటనే హెలికాప్టర్ ద్వారా అక్కడి చేరుకుని మృతదేహాలను వెలికి తీయడంతోపాటు గాయపడిన వారిని రక్షించే చర్యలు ప్రారంభించారు. ఆ మంచుకొండ దెబ్బకి ఆ హోటల్ పది మీటర్ల ముందుకు కదిలిందట.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







