ఎయిర్ ఇండియా ఉద్యోగులు బరువు పెరిగారని బదిలీ వేటు...
- January 20, 2017
57 మంది ఎయిర్ ఇండియా ఉద్యోగులను బరువు పెరిగారని వారిని గ్రౌండ్ డ్యూటీలకు బదిలీ చేసింది. క్యాబిన్ క్రూ ఉద్యోగులుగా పనిచేస్తున్న 57 మంది ఉద్యోగుల్లో ఎక్కువమంది ఎయిర్ హోస్టెస్గా విధులు నిర్వహిస్తున్నారు. వీరు అధిక బరువు ఉన్నట్లు ఎయిర్ ఇండియా గత నెలలో గుర్తించింది. త్వరగా బరువు తగ్గించుకోపోతే శాశ్వత గ్రౌండ్ డ్యూటీ ఉద్యోగులుగా చేస్తామని హెచ్చరించింది కూడా.
డెడ్ లైన్ లోగా బరువు తగ్గాలని సూచించిన ఎయిర్ ఇండియా అందులో ఫెయిల్ అయిన వారిని గ్రౌండ్ జాబ్స్కు పంపినట్లు ఎయిర్ ఇండియా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం.. అధిక బరువును కలిగివున్నట్లు గుర్తించామని చెప్పారు. గ్రౌండ్ జాబ్లో చేరడమంటే నెలకు 35 వేల నుంచి 50 వేల వరకు ప్లైయింగ్ అలవెన్స్ను కోల్పోయినట్లే. అధిక బరువు కలిగిన వారిని క్యాబిన్ క్రూ జాబ్కు తొలుత ఆరు నెలల పాటు అన్ఫిట్గా పరిగణిస్తారు. 18 నెలల్లోగా తిరిగి తక్కువ బరువును చూపించలేకపోతే పర్మినెంట్గా క్యాబిన్ క్రూ జాబ్కు అన్ఫిట్గా పరిగణిస్తారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







