సెన్సార్ పూర్తిచేసుకున్న 'నటుడు'
- January 20, 2017
యువ కథానాయకుడు నవదీప్, కావ్యశెట్టి జంటగా నటించిన చిత్రం 'నటుడు'. ఎన్.ఎస్.ఆర్ ప్రసాద్కొప్పుల దర్శకుడు. రాజేశ్వరిదేవి సమర్పణలో లెజెండ్ పిక్చర్స్ పతాకంపై రమేశ్బాబు కొప్పుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
హీరో నవదీప్ మాట్లాడుతూ 'దర్శకుడు ప్రసాద్ చెప్పిన సబ్జెక్ట్ నాకుచాలా థ్రిల్లింగ్గా అనిపించడంతో వెంటనే ఈ చిత్రంలో నటించడానికి ఒప్పేసుకున్నాను. సినిమా చాలా బాగా వచ్చింది. నటుడిగా నన్ను మరో మెట్టు ఎక్కించే చిత్రం అవుతుందన్న నమ్మకంతో ఉన్నాను. రమేశ్ బాబు పక్కా ప్రణాళికతో అనుకున్న సమయంలో సినిమాని బాగా రూపొందించారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి.'' అని చెప్పారు. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







