'థియేటర్ ఆన్ డిమాండ్' సర్వీస్ ను ప్రారంభించిన పీవీఆర్ సినిమాస్
- January 20, 2017
మల్టిప్లెక్స్ చైన్ ఆపరేటర్ పీవీఆర్ సినిమాస్ సంస్థ థియేటర్ ఆన్ డిమాండ్ సర్వీస్ 'వీకేఏఏఓ'ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి థియేటర్ ఆన్ డిమాండ్ సేవల్లో వంద స్క్రీన్లను చేర్చనున్నట్లు పీవీఆర్ వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికి 30 స్క్రీన్స్ను చేర్చనుంది. వీకేఏఏఓ వెబ్ ప్లాట్ఫాం ద్వారా ఎవరైనా తమకు నచ్చిన సినిమాలను తమకు నచ్చిన థియేటర్లలో నచ్చిన సమయంలో వేయించుకోవచ్చు. అయితే షో వేయడానికి కనీసం 50 సీట్లు బుక్ కావాల్సి ఉంటుంది. కొత్తగా ఏర్పాటు చేసే స్క్రీన్లలో సగం ఇప్పటికే తమ సేవలు ఉన్న నగరాల్లో, మిగతావి కొత్త నగరాల్లో ఏర్పాటు చేస్తామని పీవీఆర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజ్లి తెలిపారు. ప్రస్తుతం వివిధ భాషలు, జోనర్లలో 500 సినిమాలతో ఈ సేవలు ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







