బహ్రెయిన్ ఇండియన్ స్కూల్లో గ్రీన్ డ్రైవ్ ...
- January 21, 2017
బుడైయా బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ విద్యార్థులు, ప్రకృతి, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. బిఐఎస్ ఎడ్యుకేటర్ క్షమా పాండే నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. గుడ్ లిట్టర్ సర్వే పేరుతో, స్కూల్లోని డస్ట్బిన్లలో ఎలాంటి చెత్త రోజూ సమీకృతమవుతుందో పరిశీలించారు. ప్లాస్టిక్ వాడకంపైనా వివిధ క్లాసులకు వెళ్ళి ప్రచారం చేశారు. పోస్టర్లు, ఇన్స్పిరేషనల్ వీడియోస్, ఎన్విరాన్మెంటల్ బ్రోచర్స్, సర్వే రిపోర్టులతో ఈ కార్యక్రమం జరిగింది. బిఐఎస్ డైరెక్టర్ రితు వర్మ మాట్లాడుతూ, విద్యార్థుల ఇంట్రెస్ట్కి అభినందనలు తెలిపారు. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా అందరిలోనూ పరిశుభ్రత పట్ల అవగాహన పెరుగుతుందనీ, ప్రకృతి పరిరక్షణలో మనమెలా భాగమవ్వాలన్నది పిల్లల్లోనే అవగాహన రావడం వల్ల సమాజానికి మేలు జరుగుతుందని చెప్పారు. విద్యార్థులు రీయూజబుల్ ఉత్పత్తులనే ఎక్కువగా వినియోగించాలని ఈ సందర్బంగా కోఆర్డినేటర్ డాక్టర్ ప్రీత్ కమల్ భట్నాగర్ చెప్పారు.
దుబాయ్కి చెందిన ఎన్ఆర్ఐ ఫిలిం మేకర్ మరియు బిజినెస్ మేన్ సోహన్ రాయ్, భారతీయ సినీ రంగంలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. ప్రొడక్షన్, స్క్రీనింగ్ మరియు మార్కెటింగ్ స్ట్రాటజీస్ అలాగే ఇండియన్ సినిమా బిజినెస్ మోడల్కి సంబంధించి పలు విభాగాల్లో సరికొత్త మార్పుల దిశగా ఈ పెట్టుబడులు ఉపకరిస్తాయని ఆయన అన్నారు. మెరైన్ ఇంజనీర్ అయిన రాయ్ సినీ దర్శకుడిగా, నిర్మాతగా మారారు. ఇండియన్ సినిమాని గ్లోబల్ లెవల్కి తీసుకెళ్ళడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారాయన. డామ్999 సినిమాని అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా రూపొందించరు సోహన్ రాయ్. కొత్తగా మల్టీప్లెక్సుల్ని నిర్మించడం, సినిమా మార్కెట్ని కొత్త పుంతలు తొక్కించడం, అలాగే సినీ నిర్మాణంలో టెక్నాలజీని వినియోగించడం, మార్కెటింగ్లోనూ సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్ళడం వంటి ప్రణాళికల్ని అమలు చేస్తామని చెప్పారు సోహన్ రాయ్. టాలీవుడ్, బాలీవుడ్ అనే విభజన రేఖలు లేకుండా ఇండీవుడ్ పేరుతో ఇండియన్ సినిమాని ఏకీకృతం చేసి, ప్రపంచ సినిమాతో పోటీ పడేలా మన సినిమాలుండాలని అభిప్రాయపడ్డారు సోహన్ రాయ్.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







