మేయర్ పాదయాత్ర...

- January 21, 2017 , by Maagulf
మేయర్ పాదయాత్ర...

హైదరాబాద్: అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం చేసి మెరుగైన ర్యాంక్ సాధించేందుకే పాదయాత్ర చేస్తున్నామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. శనివారం ఆయన స్వచ్ఛ్‌ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంక్ కోసం దేవరకొండ బస్తీలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. చాలా ప్రాంతాలలో చెత్తను వేరు చేసే కార్యక్రమం స్వచ్ఛందంగా జరుగుతోందన్నారు. హైదరాబాద్ నగరానికి మెరుగైన ర్యాంక్ ఇచ్చేందుకు 1969 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవాల్సిందిగా ప్రజలకు మేయర్ విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com