హైదరాబాద్ నగరంలోని ధూల్ పేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది...
- January 21, 2017
హైదరాబాద్ నగరంలోని ధూల్ పేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈరోజు ఉదయం నుంచి ధూల్ పేటలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను, నిబంధనలకు విరుధ్దంగా ఉన్న భవనాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో స్థానికులు అధికారుల పై మండిపడుతున్నారు. కూల్చివేతకు నిరసన తెలుపుతూ స్థానికులు అక్కడ గుమిగూడారు. పరిస్థితి చేయిదాటడంతో జీహెచ్ ఎంసీ అధికారులు పోలీసులను రప్పించారు. ఘటనా స్థలికి చేరుకున్నపోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. తమ ప్రాణాలు పోయినా సరే... తమ ఇళ్ల కూల్చివేతను అడ్డుకుంటామని స్థానికులు చెబుతున్నారు. దీంతో, అక్కడి వాతావరణం హీటెక్కింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







