ఇండియా - యూఏఈ 'విన్ విన్' టై అప్స్
- January 23, 2017
భారత్, యూఏఈ మధ్య సత్సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయని భారత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. భారత అభివృద్ధిలో యూఏఈ అత్యంత నమ్మదగిన భాగస్వామి అని ఆయన చెప్పారు. వివిధ అంశాల్లో యూఏఈతో తమ సన్నిహిత సంబంధాలు కొనసాగుతాయని అన్నారాయన. రిపబ్లిక్ డే వేడుకల్లో అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, భారత రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొననున్నారు. భారత ప్రధాని నరేంద్రమోడీ, క్రౌన్ ప్రిన్స్ మధ్య స్నేహపూర్వక వాతావరణంలో పలు అంశాలపై చర్చలు జరగనున్నాయి. యూఏఈ అభివృద్ధిలో భారతీయ వలసదారులు అత్యంత కీలక భూమిక పోషిస్తున్నట్లు ఈ సందర్భంగా గోయల్ చెప్పారు. అలాగే యూఏఈకి చెందిన పలు కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాయి. తద్వారా భారత్ - యూఏఈ పలు అంశాల్లో విన్ విన్ సంబంధాలు కొనసాగిస్తున్నాయి. మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా షేక్ మొహమమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తోపాటు, పలువురు ప్రముఖులు ఆయన వెంట ఉండనున్నారు. అలాగే 200 మంది యూఏఈ ఎయిర్ఫోర్స్ సిబ్బంది కూడా రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొంటారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







