ఫేక్ డాక్యుమెంట్స్: రెండు సంస్థల మూసివేత
- January 23, 2017
మనామా: అధికారులు రెండు కంపెనీలను ఫేక్ డాక్యుమెంట్స్ కారణంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం మినిస్ట్రీ, ఆ కంపెనీలకు చెందిన కమర్షియల్ రిజిస్ట్రేషన్ని రద్దు చేసింది. ఇందులో ఓ లాయర్కి చెందిన కంపెనీ ఒకటి ఉంది. సిఆర్ పోర్టల్ 'సిజిలత్' ద్వారా ఫేక్ డాక్యుమెంట్లను సబ్మిట్ చేసినట్లుగా మినిస్ట్రీ ధృవీకరించింది. అడ్మినిస్ట్రేటివ్ అలాగే చట్టపరమైన చర్యలు ఈ సంస్థలపై తీసుకోబడ్తాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఎలాంటి అవకతవకలు లేని వ్యాపార వర్గాల్ని ప్రోత్సహించడంతోపాటుగా, అక్రమాలకు పాల్పడే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా క్లీన్ బిజినెస్కి ఆస్కారం కల్పించవలసిన అవసరం ఉంది. ఇందులో బాగంగానే ఏ చిన్న అవకతవకలకూ తావివ్వకుండా మినిస్ట్రీ ఎప్పటికప్పుడు తగిన చర్యల్ని తీసుకుంటోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







