ఫేక్‌ డాక్యుమెంట్స్‌: రెండు సంస్థల మూసివేత

- January 23, 2017 , by Maagulf
ఫేక్‌ డాక్యుమెంట్స్‌: రెండు సంస్థల మూసివేత

మనామా: అధికారులు రెండు కంపెనీలను ఫేక్‌ డాక్యుమెంట్స్‌ కారణంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రీ, కామర్స్‌ అండ్‌ టూరిజం మినిస్ట్రీ, ఆ కంపెనీలకు చెందిన కమర్షియల్‌ రిజిస్ట్రేషన్‌ని రద్దు చేసింది. ఇందులో ఓ లాయర్‌కి చెందిన కంపెనీ ఒకటి ఉంది. సిఆర్‌ పోర్టల్‌ 'సిజిలత్‌' ద్వారా ఫేక్‌ డాక్యుమెంట్లను సబ్‌మిట్‌ చేసినట్లుగా మినిస్ట్రీ ధృవీకరించింది. అడ్మినిస్ట్రేటివ్‌ అలాగే చట్టపరమైన చర్యలు ఈ సంస్థలపై తీసుకోబడ్తాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఎలాంటి అవకతవకలు లేని వ్యాపార వర్గాల్ని ప్రోత్సహించడంతోపాటుగా, అక్రమాలకు పాల్పడే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా క్లీన్‌ బిజినెస్‌కి ఆస్కారం కల్పించవలసిన అవసరం ఉంది. ఇందులో బాగంగానే ఏ చిన్న అవకతవకలకూ తావివ్వకుండా మినిస్ట్రీ ఎప్పటికప్పుడు తగిన చర్యల్ని తీసుకుంటోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com