ఉద్యోగాల కోసం మిడిల్ ఈస్ట్లో 98 శాతం మంది ప్రొఫెషనల్స్ ఎదురుచూపులు
- January 23, 2017
దుబాయ్: కొత్త సంవత్సరం ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఎలోసియా హెచ్ఆర్ మేనేజర్, ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తమ సంస్థ బడ్జెటరీ కట్స్ని అమలు చేయబోతోందని, తద్వారా నెలవారీ వేతనాల్లో కొంత తగ్గుదల ఉంటుందని ఆమె వెల్లడించారు. మిడిల్ ఈస్ట్ రీజియన్లో 98 శాతానికి పైగా ప్రొఫెషనల్స్ ఇప్పుడు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. బేయట్ డాట్కామ్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెలుగు చూశాయి. అయితే ఉద్యోగార్థులు, సానుకూల దృక్పథంతో ఉండడం అభినందించదగ్గది. ఇంకో వైపున 55.6 శాతం మంది ఉత్సాహంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుండగా, మిగతావారిలో కాస్త నైరాశ్యం కన్పిస్తోంది. జాబ్ సైట్స్ ద్వారా ఉద్యోగావకాశాలు ఆశించిన స్థాయిలో లభించడంలేదని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. ఇంకొందరు మాత్రం జాబ్ పోర్టల్స్ ద్వారా ఉద్యోగావకాశాలు తేలిగ్గానే లభిస్తున్నాయని అంటున్నారు. తగిన అనుభవంతోపాటుగా, ఉద్యోగాన్వేషణలో చలాకీగా వ్యవహరించడం వంటి వాటిని బట్టి ఉద్యోగాలు లభించడం అనేది ఆధారపడి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







