భార్యని హింసించిన బహ్రేయినీ వ్యక్తికి జరిమానా..
- January 23, 2017
శారీరకంగా తన భార్యను హింసించిన నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక బహ్రేయినీ వ్యక్తికి వ్యతిరేకంగా సుప్రీం అప్పీల్స్ న్యాయస్థానం100 బి డి జరిమానాని జారీ చేసింది. " ఆసుపత్రిలో నాకు వేరే అపాయింట్మెంట్ ఉండటంతో నేను ఇంటికి ఆలస్యంగా రావడం జరిగింది. నేను వచ్చినప్పుడు, నా భర్త నీవు ఎవరితోనే కలిసి తిరుగుతున్నావని అనుమానంతో కూడిన ఆరోపణలు నాపై ఆరోపిస్తుండటంతో . నేను అవి అబద్ధమని గట్టిగా తిరస్కరించిన సమయంలో, ఆగ్రహంతో ఆయన నన్ను నా తల, చేతిపై అలాగే నా వెనుక భాగంలో నన్ను తీవ్రంగా కొట్టారు. అంతేకాక నన్ను చంపుతానని బెదిరించారు, " ఆ బాధిత మహిళ న్యాయవాదుల ఎదుట ఆరోపించారు. గతంలోను ఆ వ్యక్తి తన భార్యను సామాజిక మాధ్యమాల ద్వారా ఆమెపై పలు పుకార్లు ప్రజల్లోకి వ్యాపింపచేసేందుకు ప్రయత్నించాడు. ఆ మహిళ కీర్తి పై మరక వేయడానికి ప్రయత్నించాడని ఆరోపించారు. నిందితుడి యొక్క ట్విట్టర్ ఖాతాని పరిశీలించేందుకు పోలీస్ అధికారులు ప్రయత్నించగా అందులో తమ పోలీస్ శాఖ పాలన మరియు పోలీసు అధికారుల తీరుకి వ్యతిరేకంగా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చూసి వారు విస్తుపోయారు.తమని కించపర్చిన ఆ వ్యక్తిపై ఆగ్రహిస్తూ మరొక కేసుని సైతం దాఖలు చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







