భాగ్యనగరంకు రోడ్డుపై నడిచే ట్రామ్ రైలు రాబోతోంది

- January 24, 2017 , by Maagulf
భాగ్యనగరంకు రోడ్డుపై నడిచే ట్రామ్ రైలు రాబోతోంది

రోడ్డుపై నడిచే ట్రామ్ రైలును సైతం హైదరాబాదులో ప్రవేశపెట్టేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది. మొదటి దశలో మొజంజాహీ మార్కెట్ నుంచి చార్మినార్ వరకు పనులు ప్రారంభమవుతాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు కోల్‌కతా, ముంబై వంటి నగరాల్లో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న ట్రామ్ రైలు హైదరాబాదుకు వస్తోందని నగర మేయర్ బొంతు రామ్మోహన్  రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమీషనర్ జనార్ధన్‌రెడ్డి సోమవారం బంజారాహిల్స్ ఆస్కీలో జరిగిన ఇండో ప్రెంచ్ సదస్సులో పేర్కొన్నారు. రెండు రోజుల పాటు ఇంజనీరింగ్ నిపుణులు ప్రతిపాదిత మార్గాల్లో పర్యటించి ప్రాజెక్టు వివరాలు పూర్తిస్థాయిలో సిద్దం చేస్తారని స్పష్టం చేశారు.  మొదటి దశలో ప్రాజెక్టు ప్రణాళిక ప్రకారం చార్మినార్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు, అలాగే అబిడ్స్ నుంచి సచివాలయం, రవీంద్రభారతి, సెక్రటేరియట్, హిమాయత్ నగర్, నారాయణగూడ మీదుగా మార్గం నిర్మించి తిలక్ రోడ్డు ద్వారా తిరిగి అబిడ్స్‌లో కలపాలని ప్రాథమిక ప్రణాళిక రూపొందించారు.  చార్మినార్ నుంచి గొల్కొండ వరకు కూడా మార్గం నిర్మించే యోచనలో ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com