కేసు 27కు వాయిదా...

- January 25, 2017 , by Maagulf
కేసు 27కు వాయిదా...

న్యూదిల్లీ: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ రాజస్థాన్‌లో చింకారా, కృష్ణజింకలను వేటాడినట్లు నమోదైన కేసుపై తీర్పును 27వ తేదీకి వాయిదా వేసినట్లు జోధ్‌పూర్‌ కోర్టు ప్రకటించింది. గత వారం ఇదే కోర్టులో అక్రమ ఆయుధాల కేసు నుంచి ఆయన విముక్తి పొందారు. ప్రస్తుతం ఈ కేసులో సాక్షుల వాంగ్మూలాలను ఇప్పటికే నమోదు చేశారు. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న సల్మాన్‌ ఖాన్‌ వాంగ్మూలాన్ని 1998లోనే నమోదు చేసుకున్నారు.
హమ్‌ సాథ్‌ సాథ్‌ హై.. సినిమా నిర్మాణ సమయంలో సల్మాన్‌పై కృష్ణజింకలను వేటాడినట్లు కేసు నమోదైంది. ఆయనతోపాటు సైఫ్‌ అలీ ఖాన్‌, నీలమ్‌, సోనాలీ బెంద్రె, టబూలను ఈ కేసులో సహ నిందితులుగా పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com