శీతల పానీయాలు బంద్ మార్చి 1 నుంచి..
- January 25, 2017
మార్చి ఒకటో తేదీ నుంచి బహుళజాతి సంస్థలు తయారు చేసిన శీతల పానీయాలు, మంచినీళ్ల సీసాలను విక్రయించే ప్రసక్తే లేదని తమిళనాడు విక్రయదారుల సంఘం 'పెరమైపు' ప్రకటించింది. ఫిబ్రవరి నెలంతా పానీయాల ప్రభావం గురించి వ్యాపారులకు, వినియోగదారులకు అవగాహన కల్పిస్తామని సంస్థ అధ్యక్షుడు ఏఎం విక్రమరాజా తెలిపారు. దేశీయ తయారీ పానీయాలను ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. ఎంఎన్సీ తయారు చేసిన పానీయాల్లో పిల్లలకు హాని కలిగించే పదార్థాలు ఎక్కువ మోతాదులో ఉంటున్నాయన్నారు.
6వేల అనుబంధ సంఘాలు, 15.87లక్షల సభ్యులు కలిగిన 'పెరమైపు' 1998 నుంచి కిన్లే, పెప్సికో ఉత్పత్తులకు వ్యతిరేకంగా పోరాడుతోంది.
అయితే వినియోగదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో సత్ఫలితాలను సాధించలేకపోయింది.
జల్లికట్టు సంప్రదాయం కోసం యువత చేపట్టిన శాంతియుత పోరాటం స్ఫూర్తిగా.. ఇక్కడి వనరులను ఉపయోగించుకుని కోట్లు కొల్లగొడుతున్న ఎంఎన్సీ ఉత్పత్తులను అడ్డుకోవడానికి కార్యాచరణ చేపడుతున్నట్లు విక్రమరాజా ప్రకటించారు. రెస్టారెంట్లు, హోటల్స్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు.
మే 5న వార్షిక సమావేశం
వచ్చే మే 5న వార్షిక సమావేశం నిర్వహించాలని విల్లుపురంలో జరిగిన సాధారణ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు విక్రమరాజా చెప్పారు. పాల ఉత్పత్తులను అందించే ఎంఎన్సీ సంస్థలకు పాలను సరఫరా చేసేది లేదని తమిళనాడు పాల సరఫరాదారుల, ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధి ఎస్ఏ పొన్నుస్వామి తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







