దుబాయ్ లో బుర్జ్ ఖలిఫా టవర్పై 'త్రివర్ణ' కాంతులు
- January 25, 2017
భారత్ 68వ రిపబ్లిక్డే వేడుకలు దుబాయ్లోనూ అంబరాన్నంటనున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దుబాయ్ 'బుర్జ్ ఖలిఫా' బిల్డింగ్ త్రివర్ణ పతాక శోభలీననుంది. త్రివర్ణ పతాక రంగులతో కూడిన ఎల్ఈడీ బల్బులు అర్ధరాత్రి నుంచే జగజ్జేయమానంగా తళుకులీననున్నాయి. బుర్జ్ ఖలీఫ్ ఈ విషయాన్ని ట్విట్టర్లో ప్రకటించింది. ఆంగ్ల, అరబిక్ భాషల్లో ఈ ట్వీట్ చేసింది. బుర్జ్ ఖలిఫా బిల్డింగ్ ఎత్తు 823 మీటర్లు. అబుధాబి పాలకుడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ ఖలిఫా బిన్ జాయెద్ అల్ నహాయన్ గౌరవార్ధం ఈ బిల్డింగ్కు బుర్జ్ ఖలిఫా పేరు పెట్టారు. కాగా, గురువారం జరుగనున్న భారతదేశ గణతంత్ర వేడుకల్లో అబుధాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహాయన్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









