దుబాయ్ లో బుర్జ్ ఖలిఫా టవర్పై 'త్రివర్ణ' కాంతులు
- January 25, 2017
భారత్ 68వ రిపబ్లిక్డే వేడుకలు దుబాయ్లోనూ అంబరాన్నంటనున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దుబాయ్ 'బుర్జ్ ఖలిఫా' బిల్డింగ్ త్రివర్ణ పతాక శోభలీననుంది. త్రివర్ణ పతాక రంగులతో కూడిన ఎల్ఈడీ బల్బులు అర్ధరాత్రి నుంచే జగజ్జేయమానంగా తళుకులీననున్నాయి. బుర్జ్ ఖలీఫ్ ఈ విషయాన్ని ట్విట్టర్లో ప్రకటించింది. ఆంగ్ల, అరబిక్ భాషల్లో ఈ ట్వీట్ చేసింది. బుర్జ్ ఖలిఫా బిల్డింగ్ ఎత్తు 823 మీటర్లు. అబుధాబి పాలకుడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ ఖలిఫా బిన్ జాయెద్ అల్ నహాయన్ గౌరవార్ధం ఈ బిల్డింగ్కు బుర్జ్ ఖలిఫా పేరు పెట్టారు. కాగా, గురువారం జరుగనున్న భారతదేశ గణతంత్ర వేడుకల్లో అబుధాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహాయన్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!









