దుబాయ్ లో బుర్జ్ ఖలిఫా టవర్‌పై 'త్రివర్ణ' కాంతులు

- January 25, 2017 , by Maagulf
దుబాయ్ లో బుర్జ్ ఖలిఫా టవర్‌పై 'త్రివర్ణ' కాంతులు

భారత్ 68వ రిపబ్లిక్‌డే వేడుకలు దుబాయ్‌లోనూ అంబరాన్నంటనున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దుబాయ్ 'బుర్జ్ ఖలిఫా' బిల్డింగ్‌ త్రివర్ణ పతాక శోభలీననుంది. త్రివర్ణ పతాక రంగులతో కూడిన ఎల్‌ఈడీ బల్బులు అర్ధరాత్రి నుంచే జగజ్జేయమానంగా తళుకులీననున్నాయి. బుర్జ్ ఖలీఫ్ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో ప్రకటించింది. ఆంగ్ల, అరబిక్ భాషల్లో ఈ ట్వీట్ చేసింది. బుర్జ్ ఖలిఫా బిల్డింగ్ ఎత్తు 823 మీటర్లు. అబుధాబి పాలకుడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ ఖలిఫా బిన్ జాయెద్ అల్ నహాయన్ గౌరవార్ధం ఈ బిల్డింగ్‌కు బుర్జ్ ఖలిఫా పేరు పెట్టారు. కాగా, గురువారం జరుగనున్న భారతదేశ గణతంత్ర వేడుకల్లో అబుధాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహాయన్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com