అబుధాబిలో ఆలయ నిర్మాణానికి స్థలం ఇచ్చినందుకు యువరాజుకు మోదీ ధన్యవాదాలు

- January 25, 2017 , by Maagulf
అబుధాబిలో ఆలయ నిర్మాణానికి స్థలం ఇచ్చినందుకు యువరాజుకు మోదీ ధన్యవాదాలు

అబుధాబిలో హిందూ ఆలయ నిర్మాణానికి స్థలం ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబుధాబి రాజు షేక్ మహ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్‌కు ధన్యవాదాలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిధిగా భారత పర్యటనకు వచ్చిన నహ్యాన్‌కు మోదీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వాస్తవానికి దుబాయ్‌లో కృష్ణ మందిరం, శివాలయం ఇప్పటికే ఉన్నాయి. అయితే అబుధాబిలో మాత్రం ఒక్కటి కూడా లేదు. యూఏఈలో మొత్తం 26లక్షల మంది భారతీయులున్నారు. అంటే జనాభాలో 30 శాతం. భారతీయుల సెంటిమెంట్లను గౌరవిస్తూ అబుధాబి రాజు ఈ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com