ఇదే తొలిసారి గణతంత్ర వేడుకల్లో...
- January 26, 2017
న్యూఢిల్లీ: ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలు ఇదివరకెన్నడూ లేని ఆసక్తికరమైన విషయాలకు, ప్రారంభ ఘట్టాలకు వేదికగా నిలిచాయి. ఇండియా గేట్ మొదలు రాష్ట్రపతి భవన్ దాకా మూడు కిలోమీటర్ల మేర భద్రతా దళాలు జరిపిన అద్భుత సైనిక విన్యాసాల్లో... నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) కమెండోలకు కూడా ప్రాతినిధ్యం దక్కింది. బ్లాక్ క్యాట్స్గా పేరుపొందిన ఎన్ఎస్జీ బృందాలునల్లటి యూనిఫామ్, ఆయుధాలు ధరించి అద్భుత ప్రదర్శన ఇచ్చారు. అంతేకాదు... పూర్తి స్వదేశీ విజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ అద్భుత విన్యాసంతో అదరగొట్టింది. యూఏఈ నుంచి వచ్చిన 149 మంది సభ్యుల యూఏఈ ప్రెసిడెన్సియల్ గార్డ్ బృందం కూడా భారత త్రివిధ దళాలతో కలిసి కవాతు చేయడం ఈ వేడుకలకే హైలైట్గా నిలిచింది.
35 మంది సంగీతకారుల బ్యాండ్ వెంటరాగా రాజ్పథ్ వద్ద భారత రాష్ట్రపతి ఘనంగా వందన సమర్పణ చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







