లైసెన్స్ లేని 5 గురు డ్రైవర్లను అరెస్ట్ చేసిన రాస్ అల్ ఖైమాహ్ పోలీసులు
- January 26, 2017
రాస్ అల్ ఖైమాహ్ : ఒక తీవ్రస్థాయిలో జరిగిన తనిఖీ ప్రచారంలో భాగంగా రాస్ అల్ ఖైమాహ్ పోలీసులు కేవలం రెండు రోజుల్లో లైసెన్స్ లేని ఐదుగురు డ్రైవర్లను అరెస్టు చేశారు.ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం, కూరుకుపోయిన 26 వాహనాలు తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు గుర్తించి వాటిని సైతం స్వాధీనం చేసుకున్నారు. రాస్ అల్ ఖైమాహ్ పోలీస్ కేంద్ర కార్యకలాపాల విభాగపు డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ డాక్టర్ మహమ్మద్ సయీద్ అల్ హుమైది మాట్లాడుతూ, పోలీసులు సాధారణ పరీక్షలు 'ఎల్టిజాం ' లేదా ట్రాఫిక్ ప్రచారంలో భాగంగా ఆ తనిఖీలు జరిగినట్లు తెలిపారు.రెండవ అధ్యాయం ప్రచారం లో భాగంగా , రహదారి వినియోగదారుల భద్రత మరియు భద్రతా నియమాలను బలపర్చడానికి ట్రాఫిక్ ఉల్లంఘనలు జరగకుండా ఉండేందుకు, రోడ్డు ప్రమాదాలు మరియు మరణాల అరికట్టేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.ట్రాఫిక్ పర్యవేక్షణ ఎల్టిజాం కార్యక్రమ ప్రచార ముఖ్యులు మేజర్ సేలం మహమ్ మేజర్ సేలం మహమ్మద్ బుర్కీభ మాట్లాడుతూ మంగళవారం నుంచి ఈ తనిఖీ చర్యలు ప్రారంభించబడిందని తెలిపారు.దాదాపు 78 మంది డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలు, నిబంధనలు పట్టించుకోవడం లేదని 48 గంటల్లో వారికి అతిక్రమణ టిక్కెట్లు జారీ చేశారు. అలాగే 26 మంది వాహనదారులు ప్రమాదకర ఉల్లంఘనలకు పాల్పడినందుకు వారి వాహనాలు అక్కడికక్కడే స్వాధీనం చేసుకున్నారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







