వివిధ దేశాలకు చెందిన ఏడుగురు ఖైదీలను ఉరి తీసిన కువైట్
- January 26, 2017
కువైట్: ఒకే సారి ఏడుగురికి ఉరిశిక్ష విధించి సంచలనం సృష్టించింది కువైట్ ప్రభుత్వం. పలు నేరాల్లో శిక్ష పడిన ఇద్దరు కువైటీయులు ,ఇద్దరు ఈజిప్షియన్లు, ఒక బంగ్లాదేశీ, ఒక ఫిలిప్పైన్స్ మరియు ఒక ఇథియోపియన్లు ఉన్నారు. వీరంతా హత్య, హత్యా, అపహరణ మరియు అత్యాచారం నేరాలలో దోషులుగా ఉన్నారు. ఈ ఏడుగురు విదేశీయులతోపాటు.. ఇద్దరు కువైట్ పౌరులను కూడా బుధవారం ఉరితీసింది. వీరిలో ఏకంగా రాజవంశీకుడే ఉండటం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. బుధవారం జరిగిన ఉరితీతలు 2013 మధ్య కాలం నుండి ఇప్పటి వరకు చమురు సంపన్న గల్ఫ్ రాష్ట్రంలో మొదటి మరణశిక్షలుగా పేర్కొంటున్నారు. నుస్ర అల్- ఎనేజి , మరో కువైట్ మహిళ, 2009 లో రెండవ భార్యని పెళ్ళికి తీసుకొనివెళ్ళినందుకు ఆమె భర్త పై పగతో ఒక వివాహ పార్టీకి వెళ్లి తన భర్త , సవతిని అంతమొందించాలని ఒక గుడారంకు నిప్పు పెట్టింది. ఈ అగ్ని ప్రమాదంలో మహిళలు మరియు పిల్లలు సహా 57 మంది మాది మసైపోయారు. ఫిలిపినా మరియు ఇథియోపియన్ మహిళలు పని మనుషులుగా ఆ దేశాలకు వెళ్లి అక్కడ యజమానులు కుటుంబాల సభ్యులను చంపిన నేరాలలో దోషులుగా ఉన్నారు. బంగ్లాదేశీ అపహరణ మరియు రేప్ కేసులో నేరస్థుడు కాగా ఇద్దరు ఈజిప్షియన్లు హత్య కేసులలో దోషులుగా ఉన్నారు. సరిగ్గా నాలుగు నెలల క్రితం సౌదీ కూడా యువరాజుకు మరణశిక్ష విధించి కలకలం రేపింది. సౌదీలో అయితే బహిరంగంగా తల నరికి శిక్షను అమలు చేస్తారు. మరి కువైట్లో మాత్రం అలా కాదు. దేశ ప్రధాన కారాగారంలో ఉండే ఓ ప్రత్యేక ప్రదేశంలో ఉరి తీస్తారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







